దిల్లీలో తీవ్ర భూప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు
Earthquakes tremors: దేశ రాజధాని దిల్లీలో మంగళవారం తీవ్ర భూప్రకంపనలు సంభవించాయి. పొరుగున ఉన్న నేపాల్లో వరుస భూకంపాలతో ఉత్తర భారత్లోని పలు చోట్ల ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో మంగళవారం తీవ్ర భూప్రకంపనలు (strong tremors) సంభవించాయి. పొరుగున ఉన్న నేపాల్లో గంట వ్యవధిలో వరుసగా నాలుగు భూకంపాలు (Earth quake) సంభవించాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం సమయంలో దిల్లీ- ఎన్సీఆర్ (Delhi-NCR) పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు భూమి బలంగా కంపించింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తర భారతదేశంలోని పలు చోట్ల ఈ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూ, హాపుర్, అమ్రోహా, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
నేపాల్లో ఈ మధ్యాహ్నం 2.25 ప్రాంతంలో తొలిసారి భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ గుర్తించింది. తొలుత అది 4.6 తీవ్రతతో రికార్డయ్యింది. పది కిలోమీటర్లు లోతులో అది కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సీఎస్ పేర్కొంది. ఇది గుర్తించిన అరగంటలోపే.. మధ్యాహ్నం 2.51 గంటలకు అంతకంటే ఎక్కువగా 6.2 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. ఇది భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సీఎస్ గుర్తించింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3.06, 3.19 గంటలకు మరో రెండుసార్లు స్వల్ప తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్సీఎస్ తెలిపింది.
‘రామసేతు’ వద్ద గోడ నిర్మించాలని PIL.. సుప్రీం కోర్టు ఏమందంటే..?
రెండోసారి చోటుచేసుకున్న భూకంపం తర్వాత దిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లు, ఆఫీసుల్లో ఉన్న ఫ్యాన్లు, లైట్లు ఊగాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనలపై దిల్లీ పోలీసులు సోషల్మీడియాలో స్పందించారు. ప్రజలెవరూ కంగారుపడొద్దని, సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Amit Shah: పీవోకే మనదే.. అక్కడ 24 సీట్లు రిజర్వ్: హోంమంత్రి అమిత్ షా ప్రకటన
Amit Shah: పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదేనని.. అందుకే అక్కడ సీట్లను రిజర్వ్ చేసి పెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)కు సంబంధించిన రెండు కీలక బిల్లులకు లోక్సభ బుధవారం ఆమోదం తెలిపింది. -
Arvind Kejriwal: ఆప్ పథకాలనే కాపీ కొడుతున్నారు: కేజ్రీవాల్
ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే కాపీ కొట్టి దేశంలో కొన్ని పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్నాయని కేజ్రీవాల్ విమర్శించారు. -
Gurpatwant Singh Pannun: పన్నూ బెదిరింపుల వీడియో.. దిల్లీలో అలర్ట్
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun) మరోసారి హద్దుదాటి వ్యాఖ్యలు చేశాడు. భారత్లో దాడి చేస్తామంటూ బెదిరించాడు. -
Pranab Mukherjee: వారి రాజకీయ చతురత రాహుల్ గాంధీకి అబ్బలేదు: డైరీలో రాసుకున్న ప్రణబ్ ముఖర్జీ
Pranab Mukherjee: రాహుల్ గాంధీ (Rahul Gandhi) సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండే వ్యక్తి అయినప్పటికీ.. రాజకీయాలపై ఆయన పరిణతి సాధించలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. ఈ విషయాలను ఆయన కుమార్తె తన పుస్తకంలో ప్రస్తావించారు. -
Senthil remarks: ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై మండిపడ్డ భాజపా
డీఏంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ మౌనంగా ఉండటంపై భాజపా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. -
Heart Attack: గుండెపోటు కలవరం వేళ.. 10 లక్షల మందికి సీపీఆర్ ట్రైనింగ్
గుండెపోటుకు గురైన వ్యక్తులకు సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడేందుకు కేంద్రం శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
Websites: పార్ట్టైం జాబ్ మోసాలు.. 100కి పైగా వెబ్సైట్లపై కేంద్రం నిషేధం
More than 100 websites blocked: ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న 100కి పైగా వెబ్సైట్లపై కేంద్ర ఐటీ శాఖ నిషేధం విధించింది. పార్ట్టైం జాబ్ మోసాలు, మోసపూరిత పెట్టుబడులను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
Mahadev app: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి
ఛత్తీస్గఢ్లో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక నిందితుడి తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. -
పాక్ అమ్మాయి.. భారత్ అబ్బాయి.. కొవిడ్ కష్టాలు దాటి కల్యాణం
అయిదేళ్లుగా ప్రేమించుకొంటున్న ఈ జంట కొవిడ్ సహా పలు ఆటంకాలు అధిగమించి, దేశాల సరిహద్దులు దాటి కొత్త సంవత్సర ప్రారంభంలో ఒకటి కానుంది. -
‘రైతుబిడ్డ..’ ఏడాదికి రూ.కోటి టర్నోవర్
ఆధునిక పద్ధతిలో సేద్యం చేస్తూ ఏడాదికి రూ.కోటికి పైగా టర్నోవరును సాధించిన రైతు రమేశ్ నాయక్ ‘బిలియనీర్ ఫార్మర్’ అవార్డును దక్కించుకున్నారు. -
తమిళనాడులో వర్షాలకు 12మంది మృతి
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 12మంది మృతిచెందారు. ఇందులో చెన్నైనగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది చనిపోయినట్లు యంత్రాంగం చెబుతోంది. -
వీడియో కాన్ఫరెన్స్ విచారణ ప్రసారాలు నిలిపివేత
కేసుల విచారణ సమయంలో కొన్ని అనుచిత ఘటనలు వెలుగులోకి రావడంతో బెంగళూరు, ధార్వాడ, కలబురగి పీఠాలలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేసే విచారణలను ఉన్నత న్యాయస్థానం మంగళవారం రద్దు చేసింది. -
భూ కక్ష్యలోకి తిరిగొచ్చిన చంద్రయాన్-3 మాడ్యూల్
అంతరిక్ష ప్రయోగాల పరంపరలో ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. జాబిల్లి కక్ష్యలో తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూ కక్ష్యలోకి విజయవంతంగా తీసుకువతచ్చింది. -
‘అపోలో కిడ్నీ రాకెట్’పై విచారణకు కేంద్రం ఆదేశం
దేశ రాజధాని నగరంలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిపై వచ్చిన కిడ్నీ విక్రయ కుంభకోణ ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్వోటీటీవో) ఆదేశాలు జారీ చేసిందని మంగళవారం అధికారవర్గాలు తెలిపాయి. -
పౌరసత్వం మంజూరైన అస్సాం వలసదారుల వివరాలు అందజేయండి
బంగ్లాదేశ్ నుంచి భారత్కు 1966-1971 మధ్య కాలంలో వలస వచ్చిన వారి వల్ల అస్సాం రాష్ట్ర జనాభా, సాంస్కృతిక గుర్తింపుపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపే సమాచారం ఏదీ తన ముందు లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. -
రూ.113 కోట్ల అనుమానాస్పద చెల్లింపులు నిలిపివేశాం
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కింద కోరిన క్లెయిమ్లలో అనుమానాస్పదంగా ఉన్న రూ.113 కోట్ల విలువైన క్లెయిమ్లను విచారణ పూర్తయ్యేవరకు నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో దిల్లీ వర్సిటీ భేష్
పర్యావరణ విద్య, వాతావరణ మార్పుల వంటి విషయాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. -
లారెన్స్ బిష్ణోయ్ ముఠా లక్ష్యంగా ఈడీ దాడులు
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా మనీలాండరింగ్ నెట్వర్క్ లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు మొదలయ్యాయి. -
డీప్ఫేక్ నియంత్రణపై సమీక్షించిన కేంద్రం
తప్పుడు సమాచారం, డీప్ఫేక్ల నియంత్రణలో ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. -
కొన్ని విషయాలపై మౌనమే ఉత్తమం
న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులపై కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలపకుండా కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
సురక్షిత నగరం కోల్కతా
దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా వరుసగా మూడోసారి మొదటిస్థానంలో నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
Nimmagadda: నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి.. గవర్నర్కు నిమ్మగడ్డ వినతి
-
Elon Musk: మస్క్ను తండ్రే లూజర్ అన్నవేళ..వెలుగులోకి సంచలన విషయాలు
-
Hyderabad: రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం.. 7న ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
KCR: కేసీఆర్కు సంఘీభావం తెలిపిన చింతమడక గ్రామస్థులు
-
విండోస్ 10 వాడుతున్నారా? సెక్యూరిటీ అప్డేట్స్ కావాలంటే చెల్లించాల్సిందే!
-
Redmi: ₹10 వేలకే రెడ్మీ 5జీ ఫోన్.. రెడ్మీ 13సీ ఫీచర్లు ఇవే..!