SupremeCourt: కేసు విచారణకు 40 ఏళ్లు.. 75 ఏళ్ల దోషికి సుప్రీం కోర్టు బెయిల్
హత్యాచారం కేసు విచారణలో తీవ్ర జ్యాప్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు 75 ఏళ్ల దోషికి బెయిల్ మంజూరు చేసింది.
దిల్లీ: మేన కోడలిపై హత్యాచారం కేసు విచారణలో 40 ఏళ్ల తీవ్ర జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమబెంగాల్కు చెందిన 75 ఏళ్ల దోషికి సుప్రీం కోర్టు (Supreme Court) బెయిల్ మంజూరు చేసింది. ఆయన అప్పీలుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోల్కతా హైకోర్టును సోమవారం ఆదేశించింది. దోషికి విధించిన శిక్షను రద్దు చేసేందుకు నిరాకరిస్తూ మే 2023లో కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ పూర్తి చేసేందుకు ఇంత జాప్యం ఎందుకని పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హత్యాచార ఘటన 1983లో జరిగితే.. 40 ఏళ్ల తర్వాత కస్టడీకి తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
అరుణాచల్ ఇప్పటికీ, ఎప్పటికీ.. భారత్లో అంతర్భాగమే: అనురాగ్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సునీల్ ఫెర్నాండెజ్ వాదనలు వినిపించారు. ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేయాలని కోర్టుకు విన్నవించారు. కేసు నమోదైన నాటి నుంచి అతడు బెయిల్పైనే ఉన్నాడని కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా అతడిని మళ్లీ బెయిల్పై విడుదల చేయాలన్న ఆలోచనని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. 1983-1988 మధ్య కాలంలో ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అప్పీలుదారు తన వద్ద ఇతర ఆధారాలున్నాయంటూ కోర్టును ఆశ్రయించారని, బాధితురాలు సూసైడ్ లేఖ రాసిందంటూ కొత్తవాదనను తెరమీదకు తెచ్చారని అన్నారు. అయితే, ఎఫ్ఐఆర్లో సూసైడ్ నోట్ ప్రస్తావన లేకపోవడంతో ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఆ తర్వాత 1988 నుంచి 2018 వరకు దీనిపై విచారణ జరగలేదని వివరించారు. దీనిపై జస్టిస్ అభయ్ ఓకా స్పందిస్తూ.. స్టే కోసం దరఖాస్తు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బెయిల్ పొందేందుకు కచ్చితంగా ఇంతకాలంపాటు జైలుశిక్ష అనుభవించాలన్ని నియమం ఏమీ లేదని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వ న్యాయవాది రెండు వారాల గడువు కోరగా.. ధర్మాసనం తిరస్కరించింది. సంబంధిత అంశాలన్నీ ఇప్పటికే ట్రయల్ కోర్టు రికార్డుల్లో ఉన్నాయంటూ పిటిషనర్కు బెయిల్ మంజూరు చేశారు. దీనికి సంబంధించిన విచారణను వేగవంతం చేయాలని హైకోర్టును ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
Mamata Banerjee: టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటును ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఖండించారు. ఈ యుద్ధాన్ని ఆమె తప్పకుండా గెలుస్తారంటూ ఆమెకు అండగా నిలిచారు. -
Maharashtra: ఘోరం.. కొవ్వొత్తుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
మహారాష్ట్ర (Maharashtra)లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
Amit Shah: రామ మందిర నిర్మాణం జరుగుతుందని అనుకొని ఉండరు: అమిత్ షా
దేశ యువత కోసం బంగారు భవిష్యత్తు ఎదురుచూస్తోందని, గత పదేళ్లలో దేశంలో అవినీతి, బంధుప్రీతి, కులతత్వాన్ని అభివృద్ధి భర్తీ చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. -
ఘోరం.. 24 గంటల వ్యవధిలో 9 మంది శిశువులు మృతి..!
పశ్చిమ్ బెంగాల్(West Bengal)లోని ఓ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకరోజు వ్యవధిలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. -
PM Modi: ‘వెడ్ ఇన్ ఇండియా’ను మీరే ప్రారంభించాలి.. సంపన్న కుటుంబాలకు ప్రధాని మోదీ సూచన
భారత్లో ‘వెడ్ ఇన్ ఇండియా’ సంప్రదాయాన్ని దేశంలోని సంపన్న కుటుంబాల వారు ప్రారంభించాలని ప్రధాని మోదీ కోరారు. -
Supreme Court: నేను రాజ్యాంగ సేవకుడిని : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ఓ న్యాయమూర్తిగా.. చట్టం, రాజ్యాంగానికి తానో సేవకుడినని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI D Y Chandrachud) పేర్కొన్నారు. -
Mahua Moitra: మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించారు. డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న కేసులో ఆమెపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను లోక్సభ ఆమోదించింది. -
Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
Fake Toll Plaza: గుజరాత్లో ఘరానా మోసం బయటపడింది. కొందరు మోసగాళ్లు ఏకంగా రోడ్డు వేసి.. మధ్యలో టోల్ ప్లాజా కట్టేశారు. ఏడాదిన్నరగా రూ. కోట్లు వసూలు చేస్తున్నా అధికారులు దీన్ని గుర్తించకపోవడం గమనార్హం. -
Supreme Court: విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం: మద్యం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచలేమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
Bullet Train: తొలి బుల్లెట్ రైలు స్టేషన్ను వీక్షించారా..?
ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ప్రాజెక్టు రైలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్ స్టేషన్ వీడియోను కేంద్ర మంత్రి ఎక్స్ (ట్విటర్)లో విడుదల చేశారు. -
Mahua Moitra: మహువా మొయిత్రాపై ఆరోపణలు.. లోక్సభ ముందుకు ఎథిక్స్ కమిటీ నివేదిక
Mahua Moitra: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలంటూ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. -
మోదీజీతో మా నాన్న.. కంగారేస్తోంది: స్మృతి ఇరానీ పోస్టు వైరల్
కేంద్రమంత్రి స్మృతిఇరానీ(Smriti Irani) నెట్టింట్లో చేసిన పోస్టు వైరల్గా మారింది. దానిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. -
Indian students: విదేశాల్లో 403 మంది భారత విద్యార్థుల మృతి.. అత్యధికంగా కెనడాలోనే
Indian students: గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు పలు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కెనడాలో అత్యధిక మరణాలు సంభవించాయి. -
ISRO: 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
వరుస విజయాలతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. -
బీరువాల నిండా నోట్ల కట్టలే
ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్కం ట్యాక్స్ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు. -
ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారీ
పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తున్న ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థ తన వంతు ప్రయత్నం చేస్తోంది. -
సత్పుడా పులుల అభయారణ్యంలో 10 వేల ఏళ్లనాటి రాతి చిత్తరువులు
మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో గల సత్పుడా పులుల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా 10 వేల ఏళ్ల కిందటి రాతి చిత్తరువులను అటవీ అధికారులు గుర్తించారు. -
11న 370 అధికరణం రద్దుపై సుప్రీం తీర్పు
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ వచ్చిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సోమవారం వెలువరించనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. -
దుష్యంత్ దవే లేఖపై ఎస్సీబీఏ అధ్యక్షుడి దిగ్భ్రాంతి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బహిరంగ లేఖ రాయడంపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు ఆదిశ్ సి అగ్రవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మోదీ చిత్రంతో విద్యార్థుల సెల్ఫీలు తప్పనిసరేమీ కాదు
ప్రధాని మోదీ చిత్రంతో విద్యార్థులు సెల్ఫీ దిగేందుకు వీలుగా కళాశాలల్లో ఒక సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమర్థించుకున్నారు. -
యాజమాన్య విద్యావ్యవస్థలో మార్పులు అవసరం
దేశ సమ్మిళిత అభివృద్ధి కోసం యాజమాన్య విద్యావ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్