గాంధీ మార్గం.. అదే విజయ సూత్రం
జాతిపిత మహాత్మగాంధీ వర్థంతి నేడు. ఈ సందర్భంగా యావత్ భారతావని బాపూజీని స్మరించుకుంటోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా
బాపూజీకి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
దిల్లీ: జాతిపిత మహాత్మగాంధీ వర్థంతి నేడు. ఈ సందర్భంగా యావత్ భారతావని బాపూజీని స్మరించుకుంటోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్మీడియా వేదికగా మహాత్ముడికి నివాళులర్పించారు. గాంధీజీ సిద్ధాంతాలైన శాంతి, అహింస మార్గాన్ని ప్రజలంతా పాటించాలని పిలుపునిచ్చారు.
►> యావత్ దేశం తరఫున జాతిపితకు నివాళులర్పిస్తున్నా. గాంధీ ఆదర్శాలైన శాంతి, అహింస, నిరాడంబరత, స్వచ్ఛత, వినమ్రతను మనం ఎల్లప్పుడూ పాటించాలి. మహాత్ముడు చూపిన ప్రేమ, సత్య మార్గాన్ని అనుసరించేలా కృతనిశ్చయంతో ఉండాలి - రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
►> ‘అహింసే అత్యున్నత కర్తవ్యం. మనం దాన్ని పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోయినా, దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మానవతా దృక్పథంతో హింసామార్గం నుంచి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి’ అని మహాత్మ గాంధీ అన్నారు. శాంతి, అహింస, నిస్వార్థ సేవలకు ఆయన మార్గదర్శి. బాపూజీ తన స్ఫూర్తిదాయక మాటలు, చేతల ద్వారా కాలం మీద చెరగని ముద్ర వేసి, అహింసా మార్గం దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రేరేపించారు. అణగారిన, సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంత కృషి చేశారు. గాంధీజీ జీవితం, సిద్ధాంతాలు ప్రపంచానికి స్ఫూర్తిని పంచుతున్నాయి. ఆయన వర్థంతి సందర్భంగా మహాత్ముని బోధనలను, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించే దిశగా కంకణబద్ధులమవుదాం - ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
►> బాపూజీ పుణ్యతిథిన ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నా. ఆయన ఆదర్శాలు ఇప్పటికీ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి. దేశ స్వాతంత్ర్యం, ప్రజల క్షేమం కోసం అహర్నిశలు శ్రమించి ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరినీ స్మరించుకుందాం - ప్రధానమంత్రి నరేంద్రమోదీ
►> మహాత్మ గాంధీ పుణ్య తిథిన వినయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నా - కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
►> సత్యం, అహింస, సహనం, ధైర్యం, సత్యాగ్రహం - గాంధీజీ ఆచరించిన సిద్ధాంతాలివి. వీటితో ఏ పోరాటంలోనైనా విజయం సాధించవచ్చు. బాపూజీ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నా - దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
1948 జనవరి 30న నాథూరాం గాడ్సే జరిపిన కాల్పుల్లో గాంధీజీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన వర్థంతిని పురస్కరించుకుని ఏటా ఈ రోజున అమరవీరుల దినం జరుపుకొంటున్నాం.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు