నా మాటలు ముమ్మాటికీ సరైనవే
కొద్దిరోజులుగా శ్వేతసౌధంలోనే ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. టెక్సాస్ పర్యటనకు బయల్దేరిన ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు...
ప్రసంగాన్ని సమర్థించుకున్న ట్రంప్
వాషింగ్టన్: కొద్దిరోజులుగా శ్వేతసౌధంలోనే ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. టెక్సాస్ పర్యటనకు బయల్దేరిన ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు. అమెరికా కాంగ్రెస్ భవనం క్యాపిటల్ హిల్పై తన మద్దతుదారులు దాడి చేయడానికి ముందు తాను చేసిన ప్రసంగాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. ‘‘ఎన్నికల్లో నిజమైన విజేతను నేనే. బైడెన్ కాదు’’ అన్న వ్యాఖ్యలు ముమ్మాటికీ సరైనవేనన్నారు. తనకు వ్యతిరేకంగా ప్రతినిధుల సభలో డెమొక్రాటిక్ నేతలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం పూర్తిగా అసంబద్ధమని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇది అత్యంత భయంకరమైన చర్య. దేశంలో ఆగ్రహావేశాలకు ఇది దారితీస్తుంది. అయినా మేము హింసను కోరుకోవడంలేదు. అమెరికా రాజకీయ చరిత్రలో క్షుద్ర వేటగా ఈ ప్రక్రియ మిగిలిపోతుంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. టెక్సాస్లో స్థానికులను ఉద్దేశించి ఆయన మాట్లాడే అవకాశముంది. అక్రమ వలసలకు తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందని, అమెరికా-మెక్సికో సరిహద్దు గోడను విజయవంతంగా నిర్మించిందని ఆయన వివరించనున్నారు.
దాడి చేసింది నా మద్దతుదారులు కాదు..
ప్రతినిధుల సభలో రిపబ్లికన్ అగ్రనేత కెవిన్ మెకార్టీతో ట్రంప్ మంగళవారం ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ‘‘కాంగ్రెస్ భవనంపై దాడికి పాల్పడింది నా మద్దతుదారులు కాదు. వామపక్ష యాంటిఫా కార్యకర్తలే ఆ పని చేశారు’ అని ట్రంప్ పేర్కొనగా... ‘యాంటిఫా వాళ్లు కాదు. ఎవరు దాడి చేశారో నాకు తెలుసు. నేను అక్కడే ఉన్నా’ అని మెకార్టీ చెప్పారు. ట్రంప్ తన మాటలను కొనసాగిస్తూ నిజమైన విజేతను నేనేనని చెప్పుకొచ్చారు.
ట్రంప్ గౌరవ డిగ్రీల రద్దు!
బెత్లెహెమ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్... మరో అవమానానికి గురయ్యారు! పెన్సిల్వేనియాలోని బెత్లెహెమ్లో ఉన్న లేహై యూనివర్సిటీ. గతంలో ఆయనకు ప్రదానం చేసిన గౌరవ డిగ్రీని రద్దు చేసింది. క్యాపిటల్ హిల్పై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడిన మరుసటి రోజే వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్కు చెందిన వాగ్నెర్ కాలేజ్ బోర్డు సైతం 2004లో ట్రంప్నకు ఇచ్చిన గౌరవ డిగ్రీని రద్దు చేసింది.
70 వేల ట్విటర్ ఖాతాల బంద్
క్యాపిటల్ హిల్పై దాడి నేపథ్యంలో 70 వేల ఖాతాలను స్తంభింపజేసినట్టు ట్విటర్ వెల్లడించింది. ఈ ఖాతాల ద్వారా కొందరు కుట్రపూరిత, హానికర సమాచారాన్ని చేరవేస్తున్నారని పేర్కొంది. మరోవైపు- ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల నుంచి ‘స్టాప్ ద స్టీల్’ కంటెంట్ను తొలగిస్తున్నట్టు ఫేస్బుక్ వెల్లడించింది. ఎన్నికల అక్రమాలను అడ్డుకోవాలంటూ ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి పేర్కొన్న ఈ నినాదం హింసకు దారితీస్తోందని ఫేస్బుక్ ఇంటిగ్రిటీ విభాగం వైస్ ప్రెసిడెంట్ గై రోజెన్ తెలిపారు.
క్యాపిటల్ హింసాకాండలో బాంబులు! వాషింగ్టన్: అమెరికా పార్లమెంటు భవనం క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా... ఆందోళనకారులు బాంబులను సైతం ఉపయోగించినట్లు తెలుస్తోంది! గత బుధవారం హింసాకాండ కొనసాగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది వీటిని నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమైనట్లు మంగళవారం వెల్లడైంది. వాషింగ్టన్లోని రిపబ్లికన్, డెమొక్రాటిక్ నేషనల్ కమిటీల కార్యాలయాలకు అత్యంత సమీపంలో క్యాపిటల్ పోలీసు, ఎఫ్బీఐ బృందాలు రెండు పైపు బాంబులను గుర్తించాయి. వీటిలో గుర్తుతెలియని పొడి, లోహాలు ఉన్నాయని... టైమర్లను కూడా ఈ బాంబులకు అమర్చారని అధికారులు వెల్లడించారు. దాడి సందర్భంగా క్యాపిటల్ భవనం వద్ద నిలిచిన ఓ ట్రక్కులో ఎం4 కార్బైన్ రైఫిల్, 11 సీసా బాంబులను పోలీసులు గుర్తించారు. అనంతరం ట్రక్కు డ్రైవరును అరెస్టు చేశారు. |
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు