75 ఏళ్ల తరవాత మరో యుద్ధం చేస్తున్నాం:ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవకాశం దొరికితే చాలు అంతర్జాతీయ వేదికలపై చైనా చర్యలను ఎండగడుతుంటారు.
చైనాపై విరచుకుపడిన అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవకాశం దొరికితే చాలు అంతర్జాతీయ వేదికలపై చైనా చర్యలను ఎండగడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణకు ఆ దేశ చర్యలే కారణమంటూ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ చైనా వైరస్ వ్యాప్తికి ఐరాస ఆ దేశాన్ని జవాబుదారీ చేయాలంటూ డిమాండ్ చేశారు. అగ్రరాజ్యంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించడంతో 2లక్షల మంది అమెరికన్లు బలయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంఖ్య సుమారు 10లక్షలుగా ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ఐరాస సర్వ ప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశాల్లో వీడియో సందేశం ద్వారా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 75 సంవత్సరాల తరవాత ప్రపంచం అతి పెద్ద సమస్యను ఎదుర్కోంటోంది. కనిపించని శత్రువైన ‘చైనా వైరస్’పై తీవ్ర పోరాటం చేస్తున్నాం. 188 దేశాల్లోని అనేక మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మన ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాను జవాబుదారీ చేయాలి. ఈ మహమ్మారి ప్రారంభ దశలో చైనా దేశీయంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించిన్పటికీ, అంతర్జాతీయంగా ఎలాంటి ఆంక్షలు విధించకుండా వైరస్ వ్యాప్తికి కారణమైంది’ అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరును తప్పుబట్టారు. ఆ సంస్థ చైనా ఆడించినట్లు ఆడుతోందని విమర్శించారు. ‘చైనా ప్రభుత్వం, అది చెప్పినట్లు ఆడే ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్లో మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకినట్లు ఆధారాలు లేవని ప్రకటించాయి. తరవాత లక్షణాలు లేని వ్యక్తుల నుంచి ఈ వైరస్ వ్యాపించదని మరో తప్పుడు ప్రకటన చేశాయి. ఐరాస వారి చర్యలను పరిగణనలోకి తీసుకొని చైనాను జవాబుదారీ చేయాలి’ అంటూ చైనాపై మండిపడ్డారు.
అంతేకాకుండా పర్యావరణానికి తీవ్ర స్థాయిలో హాని కలిగించే విధంగా చైనా తీరు ఉందని ఆ దేశ చర్యలను దుయ్యబట్టారు. ‘యూఎస్ కంటే చైనా నుంచి కార్బన్ ఉద్గారాల శాతం రెట్టింపుగా ఉంది. ఆ పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ దేశం మిలియన్ల కొద్ది టన్నుల్లో ప్లాస్టిక్ను సముద్రాల్లోకి విచ్చలవిడిగా కుమ్మరించడంతో పగడపు దిబ్బలకు హాని కలుగుతోంది. ఇతర దేశాల సముద్రజల్లాల్లోకి చొచ్చుకొని వచ్చి పరిమితికి మించి చేపలు పడుతుండటం తీవ్ర పరిణామం’ అంటూ చైనా చర్యలను ఖండించారు.
కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నుంచి ప్రపంచాన్ని కమ్మేసిందని నిపుణులు భావిస్తున్నారు. దీని కారణంగా ఆమెరికా తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాగా, వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుందని, దాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి, వైరస్కు అమెరికా చరమగీతం పాడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఏదో ఒక అంశంపై చైనాపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. చైనా కూడా ఆ విమర్శలను గట్టిగానే తిప్పికొడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
నాగాలాండ్లో 6 జిల్లాల్లో సున్నా పోలింగ్ నమోదైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు