Tunnel: దిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు సొరంగం..!
దేశ రాజధాని దిల్లీ శాసనసభలో ఏళ్ల క్రితం నాటి సొరంగం ఒకటి తాజాగా బయటపడింది. ఈ సొరంగ మార్గం అసెంబ్లీ నుంచి ఎర్ర కోట వరకు ఉందట. అయితే దీన్ని
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ శాసనసభలో ఏళ్ల క్రితం నాటి సొరంగం ఒకటి తాజాగా బయటపడింది. ఈ సొరంగ మార్గం అసెంబ్లీ నుంచి ఎర్ర కోట వరకు ఉందట. అయితే దీన్ని బ్రిటిష్ హయాంలో ఉపయోగించేవారని శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తెలిపారు.
‘‘1993లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ టన్నెల్ గురించి విన్నాను. ఇది ఎర్రకోట వరకు ఉంటుందని చెప్పేవారు. బ్రిటిష్ వారు స్వాతంత్ర్య సమరయోధుల తరలింపు కోసం ఈ రహస్య మార్గాన్ని ఉపయోగించేవారని చెప్పుకునేవారు. 1912లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధానిని కోల్కతా నుంచి దిల్లీకి మార్చిన తర్వాత ఈ భవనాన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉపయోగించేది. ఆ తర్వాత 1926లో దీన్ని కోర్టుకు మార్చారు. అప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను కోర్టుకు తీసుకొచ్చేందుకు ఈ మార్గాన్ని ఉపయోగించేవారు. దీని చరిత్రను తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కచ్చితమైన సమాచారం లభించలేదు’’ అని స్పీకర్ గోయల్ వెల్లడించారు.
ఈ సొరంగం ప్రవేశమార్గం గురువారం బయటపడిందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి తాము ఈ సొరంగ మార్గాన్ని తవ్వాలనుకోవడం లేదన్నారు. మెట్రో ప్రాజెక్టులు, డ్రైనేజీ వ్యవస్థలతో ఈ సొరంగంలో చాలా భాగం ఇప్పటికే ధ్వంసమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప చరిత్ర కలిగిన ఈ టన్నెల్ను పర్యాటక ప్రాంతంగా మారుస్తామని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!