ట్విటర్ గ్రీవెన్స్ అధికారి గుడ్బై
ట్విటర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి తన పదవికి గుడ్బై చెప్పారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చాతుర్ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాల........
దిల్లీ: ట్విటర్ ఇండియా తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి తన పదవికి గుడ్బై చెప్పారు. నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఇటీవలే నియమితులైన ధర్మేంద్ర చాతుర్ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విటర్ సైతం నిరాకరించింది. భారత ప్రభుత్వానికి, ట్విటర్కు మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
50 లక్షల యూజర్లను కలిగిన సోషల్మీడియా కంపెనీలు భారత్కు చెందిన ముగ్గురు అధికారులను నియమించుకోవాలని, వారి వివరాలను పొందుపరచాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. ఆ మేరకు మిగిలిన సోషల్మీడియా కంపెనీలు గ్రీవెన్స్ అధికారులతో పాటు ఇతర అధికారులను నియమించుకున్నాయి. ట్విటర్ మాత్రం ఈ విషయంలో ఆలస్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం చివరి నోటీసుకు స్పందిస్తూ చీఫ్ కాంప్లియన్స్ అధికారిని నియమిస్తామని, అదే సమయంలో చాతుర్ను తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తున్నట్లు ఇటీవల తెలిపింది. కొద్దిరోజులకే ఆయన వైదొలగడంతో గ్రీవెన్స్ అధికారి స్థానంలో ఆయన పేరును తొలగించింది. ప్రస్తుతం అమెరికా అడ్రస్, ఈ-మెయిల్ ఐడీతో కూడి మరొకరి పేరు చూపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు