గ్లైడర్‌ కూలి ఇద్దరు నావికా సిబ్బంది మృతి

భారత నావికాదళానికి చెందిన ఓ గ్లైడర్‌ కూలిన ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. కేరళలోని కొచ్చి నావికాస్థావరానికి సమీపంలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.............

Published : 04 Oct 2020 11:06 IST

కొచ్చి: భారత నావికాదళానికి చెందిన ఓ గ్లైడర్‌ కూలిన ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. కేరళలోని కొచ్చి నావికాస్థావరానికి సమీపంలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. రోజువారీ విధుల్లో భాగంగా ఐఎన్‌ఎస్‌ గరుడ నుంచి ఓ శిక్షణా పవర్‌ గ్లైడర్‌ ఆదివారం ఉదయం టేకాఫ్‌ అయింది. చక్కర్లు కొడుతున్న క్రమంలో ఒక్కసారిగా తొప్పుంపాడి బ్రిడ్జికి సమీపంలో కుప్పకూలింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు వెంటనే అందులో ఉన్న లెఫ్టినెంట్‌ రాజీవ్‌ ఝా, పెట్టీ ఆఫీసర్‌ సునీల్‌ కుమార్‌ను ఐఎన్‌హెచ్‌ఎస్‌ సంజీవనికి తరలించారు. అప్పటికే వారివురు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని