Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు సైనికుల వీరమరణం!

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనిక సిబ్బంది వీరమరణం పొందారు....

Published : 15 Oct 2021 13:56 IST

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. మృతుల్లో ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి (జేసీఓ) ఉన్నారు. పూంఛ్‌ జిల్లా నర్ ఖాస్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. జవాన్‌ మృతదేహాన్ని భద్రతా బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకోగా.. జేసీఓ మృతదేహం ఇంకా లభించాల్సి ఉంది. ఇటీవల పూంఛ్‌ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ముష్కరులంతా గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలో పాగా వేసినట్లు పోలీసులు సమాచారం అందిన నేపథ్యంలోనే నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వరుస ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు