Poonch encounter: రెండు వారాలైనా ఎన్కౌంటర్ ముగియలేదెందుకు..?
దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పూంచ్ ఎన్కౌంటర్లో భద్రతా దళాలకు మరో ఎదురుదెబ్బతగిలింది. ఆదివారం ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితో సహా.. బందీగా ఉన్న మరో ఉగ్రవాదిని గాయపర్చారు. భటా-దురయిన్ వద్ద
* పూంచ్లో మరోసారి ఉగ్రవాదుల పంజా..!
ఇంటర్నెట్డెస్క్: దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పూంచ్ ఎన్కౌంటర్లో భద్రతా దళాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం ఉగ్రవాదులు దాడి చేసి ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితో సహా.. బందీగా ఉన్న మరో ఉగ్రవాదిని గాయపర్చారు. భాతా-దురియా వద్ద ఎన్కౌంటర్ జరుగుతోన్న ప్రదేశానికి పోలీసులు, సైనికులు కలిసి.. తమ వెంట లష్కరే సంస్థకు చెందిన జియా ముస్తఫా అనే పాకిస్థానీ ఉగ్రవాదిని తీసుకెళ్లారు. ఆ ఉగ్రవాదితో కలిసి అడవిలోని ఓ ఉగ్ర స్థావరం వద్దకు భద్రతా దళాలు చేరుకొన్నాయి. అదే సమయంలో ఆ స్థావరంలో నక్కిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక సైనికుడితోపాటు ఉగ్రవాది ముస్తఫా కూడా గాయపడ్డాడు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురుదాడి ప్రారంభించాయి.
కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆగస్టులోనే సైన్యం భారీ ఎత్తున గాలింపు చేపట్టింది. గాలింపు బృందాలకు సురాన్కోటెలోని డేరాకి గల్లీ ప్రాంతంలో అక్టోబర్ 10-11 అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులతో మొదటిసారిగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక జేసీవోతో సహా ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రదేశం పూంచ్-రాజౌరీ జిల్లాల మధ్యలో ఉంటుంది. దీంతో ఉగ్రవాదులు రాజౌరీ వైపు అడవుల్లోకి పారిపోయారు. అక్టోబర్ 14న మరోసారి ఉగ్రవాదులు దాడి చేయడంతో నలుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. దీంతో సైన్యం పారా ట్రూపర్లను, డ్రోన్లను కూడా రంగంలోకి దించింది.
కఠనమైన పర్వతాలు.. చిక్కటి అడవులు..!
ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశం భౌగోళికంగా అత్యంత కఠినంగా ఉంది. ఇక్కడ ఏటవాలు పర్వతాలపై పరుచుకొన్న చిక్కటి అడవుల్లో ఉన్న లోయలు, గుహలు, శిఖరాలు ఉగ్రవాదులకు రక్షణ ఇస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇక్కడ 8-10 మంది ముష్కరులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనికి తోడు ఈ ఉగ్రవాదులు పాక్ ఎస్ఎస్జీ కమాండోల వద్ద శిక్షణ పొందినట్లు భావిస్తున్నారు. ఉగ్రవాదులు చిన్న,చిన్న గ్రూపులుగా విడిపోయి తరచూ స్థావరాలు మారుస్తూ దాడులకు దిగుతున్నారు.
ఎన్కౌంటర్ ప్రదేశంలోని మెందహార్ నార్ ఖాస్ ప్రాంతంలో పర్వత గుహలు విపరీతంగా ఉన్నాయి. వీటిల్లో ముష్కరులు దాక్కొంటున్నారు. దీంతో సైన్యం కూడా ఈ ఆపరేషన్ను అత్యంత జాగ్రత్తగా నిదానంగా చేపట్టాలని నిర్ణయించింది. పూంచ్-రాజౌరీ రేంజి డీఐజీ వివేక్ గుప్తా దీనిపై మాట్లాడుతూ ‘‘దళాలు ఒక వ్యూహం ప్రకారం ఆపరేషన్ చేపట్టాయి. ఇది ముగియడానికి కొంత సమయం పడుతుంది. కచ్చితంగా దళాలే విజయం సాధిస్తాయి’’ అని పేర్కొన్నారు. ఒక్కో ప్రదేశంలో పూర్తిగా కూంబింగ్, తనిఖీలు, ఏరివేతను ముగించి మరో ప్రదేశానికి దళాలు చేరుతున్నాయి.
రాజౌరీ-పూంచ్ ఉగ్రవాదుల అడ్డగా..
ఈ ఏడాది జూన్ నుంచి జమ్ము పరిధిలోని రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇక్కడ 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇక్కడ భౌగోళిక స్వరూపం ఉగ్రవాదులకు రక్షణ ఇస్తోంది. దీంతో 1990ల నుంచే భారీగా విదేశీ ముష్కరులు ఇక్కడికి వస్తున్నారు. అడవుల్లో అక్కడక్కడా ఉండే ఉగ్రవాదులను గుర్తించడం చాలా కష్టం. ఉగ్రవాదులకు స్థానికుల్లో కొందరు సహకరిస్తుండటం కూడా ఆపరేషన్ను కష్టతరంగా మారుస్తోంది. ఇప్పటికే ఉగ్రవాదులకు సహకరిస్తున్నారన్న అనుమానంతో దాదాపు 8 మంది స్థానికులను దళాలు అదుపులోకి తీసుకొన్నాయి.
నియంత్రణ రేఖ సమీపంలో నివసించే ప్రజలు విదేశీ ఉగ్రవాదుల సమాచారాన్ని గతంలో చాలా సార్లు దళాలకు ఉప్పందించారు. గతంలో కూడా పూంచ్లోని హల్కాక గ్రామాన్ని కూడా స్థానికులు ఇచ్చిన సమాచారంతోనే దళాలు స్వాధీనం చేసుకోగలిగాయన్న విషయాన్ని కశ్మీర్ మాజీ డీజీపీ ఎస్పీ వైద్ గుర్తుచేశారు. ఈ సారి పరిస్థితి కొంత మారింది.
ఫలితంగా క్షేత్రస్థాయిలో దళాలకు ఇంటెలిజెన్స్ సమాచారం లభించడం కష్టమవుతోంది. అందుకే ఎన్కౌంటర్ మొదలై 14 రోజులు పూర్తవుతున్నా.. ఉగ్రవాదులు కచ్చితంగా ఎక్కడున్నారనే విషయంపై స్పష్టత రావడంలేదు. ఎన్కౌంటర్ దృష్ట్యా స్థానిక ప్రజలను ఇళ్లుదాటి బయటకు రావద్దని భద్రతా దళాలు కోరాయి. జమ్ము-రాజౌరీ జాతీయ రహదారి కూడా మూతపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..