IAF:నివురుగప్పిన ముప్పు ముంగిట్లో భారత్!
జమ్ములోని కల్చుక్లో ఆదివారం రాత్రి రెండు డ్రోన్లు తిరిగినట్లు సైన్యం గుర్తించింది. రాత్రి 11.45 గంటలప్పుడు ఒక డ్రోన్, అలాగే 2.40 సమయంలో మరో డ్రోన్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ రెండూ క్వాడ్కాప్టర్లే.
‘రెక్కలు’తొడిగిన ఉగ్రవాదం..!
కల్చుక్ సైనిక స్థావరం వద్ద మరో రెండు డ్రోన్లు..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
జమ్ములోని కల్చుక్లో ఆదివారం రాత్రి రెండు డ్రోన్లు తిరిగినట్లు సైన్యం గుర్తించింది. రాత్రి 11.45 గంటలప్పుడు ఒక డ్రోన్, అలాగే 2.40 సమయంలో మరో డ్రోన్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ రెండూ క్వాడ్కాప్టర్లే. వీటిపై జవాన్లు 25 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. కానీ చీకట్లో అవి వేగంగా తప్పించుకొన్నాయి. వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరో సైనిక స్థావరం వద్ద డ్రోన్ల సంచారం ఆందోళనకరంగా మారింది. దీంతో సైన్యం అప్రమత్తమైంది. ఆ ప్రదేశంలో దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
100 మీటర్ల ఎత్తు నుంచి దాడి
జమ్ములోని వాయుసేన స్థావరంపై జరిగిన డ్రోన్ దాడి వివరాలు మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇందులో రెండు డ్రోన్లు పాల్గొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. పేలుళ్లకు ముందు రెండు డ్రోన్లు ప్రయాణించిన చప్పుడు వచ్చినట్లు గుర్తించారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఒక్కో డ్రోన్ 2 కిలోల చొప్పున అత్యంత శక్తిమంతమైన ఐఈడీలను మోసుకొచ్చాయి. దాడి చేసిన అనంతరం అవి సురక్షితంగా వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. వీటిని దాదాపు 100 మీటర్ల ఎత్తు నుంచి వినియోగించి ఉండొచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బృందాలు అనుమానిస్తున్నాయి. వీటిని పాకిస్థాన్ నుంచి లేదా స్థానిక ఉగ్రవాదుల సాయంతో భారత్ నుంచే ఆపరేట్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ తేలిక పాటి డ్రోన్లు 100- 150 మీటర్ల ఎత్తు నుంచి పేలుడు పదార్థంతో చీకటిలో ప్రయాణించాయి. ఈ కారణంగానే అవి లక్ష్యాన్ని స్పష్టంగా గుర్తించలేకపోయాయని నిపుణులు చెబుతున్నారు. అదే భారీ డ్రోన్లు వస్తే నష్ట తీవ్రత ఎక్కువగానే ఉండేదని వెల్లడించారు.
భారత్లోనే ఆరు లక్షలు..!
ఇటీవల కాలంలో సరిహద్దుల వద్ద డ్రోన్ల సంచారం పెరిగిపోయింది. మరోవైపు చైనా కూడా డ్రోన్ల వినియోగంలో చాలా ముందుంది. ఇక భారత్లో డ్రోన్ల వినియోగానికి సంబంధించి ఎక్కడా నిబంధనలు అమలు చేస్తున్నట్లు కనిపించదు. 2019లో వివిధ భద్రతా సంస్థలు నిర్వహించిన సర్వేలో దేశంలో 6 లక్షలకు పైగా వివిధ సైజులు, సామర్థ్యాలు ఉన్న డ్రోన్లు ఉన్నట్లు తేలింది. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇవి ఉగ్రవాదులు, అసాంఘిక శక్తుల చేతిలో పడితే విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక సదుపాయాలకు పెనుముప్పు పొంచి ఉన్నట్లే. సరిహద్దు నగరాలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాల్సిందే. కంపెనీలు, విమనాశ్రయాలకు భధ్రత కల్పించే సీఐఎస్ఎఫ్ స్నైపర్లు, ఎన్ఎస్జీ కమాండోలు, ఇతర భద్రతా సిబ్బందికి వీటిపై ఎలా స్పందించాలనే అంశంపై ఎస్వోపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను వాయుసేన సహకారంతో తయారు చేయాల్సివుంది. భారత్ వద్ద వీటిని ఎదుర్కోవడానికి అవసరమైన టెక్నాలజీ లేదు.
చిన్నవి, రిమోట్ కంట్రోల్ డ్రోన్లతోనే ఎక్కువ ముప్పు పొంచి ఉంది. రూ.20వేలకు దొరికే వాణిజ్య శ్రేణి డ్రోన్లు కూడా 5 కేజీల వరకు బరువును మోయగలవు. ఇవి మన సైనిక రాడార్లలో ఒక చిన్న పక్షివలే కనిపిస్తాయి. దీంతో వీటిని గుర్తించడం చాలా కష్టం. వీటిని కూల్చడానికి భారీ రాకెట్లను, క్షిపణులను ప్రయోగించడం అంటే వనరుల్ని వృథా చేసుకోవడమే. ఈ నేపథ్యంలో భద్రతా సంస్థలు స్కైఫెన్స్, అథెనా, డ్రోన్క్యాచర్, స్కైవాల్ 100 వంటి టెక్నాలజీలను పరిశీలిస్తున్నాయి.
భారత్ ముందున్న మార్గాలు..
సాధారణంగా సైనిక స్థావరాల్లో ఫైటర్ జెట్లను పేలుళ్లకు తట్టుకొనే హ్యాంగర్లలో భద్రపరుస్తారు. కానీ రాడార్లు, ఇతర కమ్యూనికేషన్ సామగ్రి మాత్రం బాహ్య ప్రదేశంలో ఉండాల్సిందే. దీంతో వీటికి డ్రోన్ల ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో డ్రోన్లను గుర్తించే రాడార్లను రంగంలోకి దించడం, లేజర్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్గన్స్ను మోహరించడం వంటివి చేయవచ్చు. ఈ గన్స్ నిమిషానికి 4,600 రౌండ్లు ఫైర్ చేయగలవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)