Ukraine Crisis: దిల్లీ చేరుకున్న 28మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ ఉన్న విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
దిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ ఉన్న విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికే బుకారెస్ట్ (రొమేనియా) చేరుకున్న వారిలో కొంతమందిని భారత్కు తీసుకొచ్చారు. వీరిలో 17 మంది తెలంగాణ విద్యార్థులు ఈ తెల్లవారుజామున దిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని ఉచితంగా తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దిల్లీలోని తెలంగాణ అధికారులు విద్యార్థులను తెలంగాణ భవన్కు తీసుకెళ్లారు. ఈ సాయంత్రం కల్లా వారిని తెలంగాణకు తీసుకురానున్నారు. మరోవైపు ఏపీకి చెందిన 11 మంది విద్యార్థులు కూడా ఈ ఉదయం ఉక్రెయిన్ నుంచి దిల్లీకి చేరుకున్నారు. వారిని అధికారులు ఏపీ భవన్కు తీసుకెళ్లారు. ఏపీ భవన్లో ఉన్న 11 మంది విద్యార్థుల్లో ఉదయం 9 గంటలకు ముగ్గురు బెంగళూరుకు (కడప విద్యార్థినులు), మధ్యాహ్నం 12గంటలకు ఐదుగురు విజయవాడకు, సాయంత్రం 6గంటలకు ముగ్గురు విద్యార్థులు విశాఖకు చేరుకోనున్నట్లు ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు.
శంషాబాద్ విమానాశ్రయానికి 20 మంది విద్యార్థులు
ఉక్రెయిన్ నుంచి నిన్న రాత్రి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 20మంది ముంబయికి చేరుకున్న విషయం తెలిసిందే. వారు అక్కడి నుంచి ఈ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ భారత ఎంబసీ సాయంతో క్షేమంగా చేరుకోగలిగామన్నారు. క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.
దిల్లీ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్..
ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలంగాణ వాసులు, విద్యార్థుల కోసం దిల్లీ విమానాశ్రయంలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3 వద్ద ఏర్పాటు చేసిన డెస్క్.. విద్యార్థులకు సహాయసహకారాలు అందిస్తోంది. ఈ డెస్క్ ద్వారా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?