IND-DUBAI: దుబాయ్ ఫ్లైట్ రెడీ..!
రెండు నెలల విరామం తరువాత ఇరు దేశాల మధ్య విమాన సేవలు పునఃప్రారంభం అవుతున్నాయి
రెండు నెలల అనంతరం అందుబాటులోకి సేవలు
దుబాయ్: దేశంలో కరోనా కారణంగా ఏప్రిల్25 నుంచి దుబాయ్ - భారత్ మధ్య విమాన సేవలు నిలిచిపోయాయి. కాగా, వచ్చే వారం నుంచి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ వెల్లడించింది. ‘‘దక్షిణ ఆఫ్రికా, నైజీరియా, భారత్ దేశాలకు చెందిన ప్రయాణికులకు విమానసేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ముఖ్యంగా భారత్ దేశ ప్రయాణికులు వారి రెసిడెన్స్ వీసాతో పాటు యూఏఈ ధ్రువీకరించిన రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే ఎమిరేట్స్లో ప్రయాణించేందుకు అనుమతి లభిస్తుంది. అంతేకాకుండా ప్రయాణానికి బయలుదేరే ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది’’ అని ఎమిరేట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో ఇరు దేశాల మధ్య వారానికి సుమారు మూడు వందల సర్వీసులు అందుబాటులో ఉన్నట్లు ఆసంస్థ వెల్లడించింది. కాగా, రెండు నెలల విరామం తరువాత ఇరు దేశాల మధ్య విమాన సేవలు పునఃప్రారంభం అవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్