Boris Johnson: బ్రిటన్‌ ప్రధాని భారత పర్యటన ఖరారు.. ఎప్పుడు రానున్నారంటే?

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 21న ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు. తర్వాత రోజు దేశ రాజధాని దిల్లీలో పర్యటించనున్నారు....

Published : 17 Apr 2022 15:00 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన ఖరారైంది. ఈ నెల 21న ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు. తర్వాత రోజు దేశ రాజధాని దిల్లీలో పర్యటించనున్నారు. గుజరాత్‌కు రానున్న తొలి బ్రిటన్‌ ప్రధాని ఈయనే కావడం విశేషం.

భారత ప్రధాని నరేంద్ర మోదీతో బోరిస్‌ చాలా లోతైన చర్చలు జరపనున్నారని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం శనివారం వెల్లడించింది. బ్రిటన్‌, భారత్‌లో కీలక పరిశ్రమల్లో పెట్టుబడులపై ప్రకటనలు వెలువడనున్నాయని తెలిపింది. దిల్లీలో మోదీని కలవనున్న బోరిస్‌ ఇరు దేశాల వ్యూహాత్మక రక్షణ, దౌత్య, ఆర్థిక భాగస్వామ్యాలపై చర్చించనున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురోగతిపైనా ఇరు దేశాధినేతలు దృష్టిసారించనున్నారు.

‘‘ఉద్యోగాల సృష్టి, ఆర్థిక వృద్ధి, రక్షణ, ఇంధన రంగాల్లో భద్రత వంటి అంశాలపై నా భారత పర్యటన కొనసాగనుంది. అంతిమంగా ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నాం. నియంతృత్వ శక్తులు శాంతిసామరస్యాలకు సవాల్‌ విసురుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశాలు కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. అతిపెద్ద ఆర్థిక శక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్‌కు బ్రిటన్‌ ఎంతో విలువిస్తోంది’’ అని పర్యటనకు ముందు బోరిస్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని