Video: మద్యం దుకాణంపై ఆవు పేడ విసిరికొట్టిన మాజీ సీఎం!
రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలంటూ (Liquor ban demand) కొంత కాలంగా ఉద్యమిస్తోన్న ఆమె ఈసారి ఓ మద్యం దుకాణంపై ఏకంగా ఆవుపేడతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.......
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, భాజపా ఫైర్ బ్రాండ్ ఉమా భారతికి (Uma Bharti) మరోసారి కోపమొచ్చింది. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలంటూ (Liquor ban demand) కొంత కాలంగా ఉద్యమిస్తోన్న ఆమె ఈసారి ఓ మద్యం దుకాణంపై ఏకంగా ఆవుపేడతో దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్లోని నివారి జిల్లాలో ఆధ్యాత్మిక నగరమైన ఓర్చాలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ మద్యం దుకాణం ఏర్పాటు చేసిన స్థలానికి అనుమతి లేదని, ఎంతో పవిత్ర నగరమైన ఓర్చాలో ఇలాంటి దుకాణం తెరవడం నేరమంటూ ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె పేడ విసిరిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో తీసిన వ్యక్తితో ‘‘చూడండి.. నేను ఆవుపేడ విసిరాను.. రాళ్లు రువ్వలేదు’’ ఆమె అన్నట్టుగా రికార్డయింది. ఈ ఏడాది మార్చిలో భోపాల్లోని ఓ మద్యం దుకాణంపై రాళ్లతో దాడి చేసిన వీడియోలు అప్పట్లో వైరలైన సంగతి తెలిసిందే.
నిన్నటి ఘటన తర్వాత ఆమె వరుస ట్వీట్లు చేశారు. ఓర్చా నగరం ప్రధాన ద్వారం వద్ద మద్యం దుకాణం ఉంది. ఇప్పుడు ఆ దుకాణం ఉన్న ప్రదేశంలో దానికి అనుమతి లేదు. దీనిపై ప్రజలు, మా సంస్థ సభ్యులు నిరంతరం నిరసనలు చేపడుతున్నారు. ఈ దుకాణాన్ని అక్కడి నుంచి తీసేయాలని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నారు. వినతి పత్రాలూ ఇస్తున్నారు. పవిత్రమైన నగరం నుదుటిన ఈ దుకాణం పెద్ద కళంకంగా ఉన్నందున దాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి వస్తోన్న స్పందనలను నేరంగా పేర్కొనలేం.. ఎందుకంటే అక్కడ ఈ దుకాణం తెరవడమే ఓ పెద్ద నేరం’’ అని పేర్కొన్నారు.
‘‘ఏప్రిల్లో శ్రీరామ నవమి సందర్భంగా ఓర్చాలో నిర్వహించిన దీపోత్సవ్ కార్యక్రమం రోజున ఐదు లక్షల దీపాలు వెలిగించినప్పుడు ఈ దుకాణం తెరిచి ఉందని నాకు సమాచారం అందింది. ఇది అయోధ్యలా పవిత్రమైనది. అందుకే పవిత్రమైన గోశాలలోని ఆవుపేడను మద్యం దుకాణంపై విసిరికొట్టాను. అయినా మా భావజాలానికి చెందిన సంస్థలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఆ దుకాణం ఇంకా తెరిచి ఉంచడం సిగ్గుచేటు’’ అన్నారు. అయితే, ఈ మద్యం దుకాణం మంజూరైన స్థలంలోనే ఉందని ఓర్చా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి అభయ్ సింగ్ అన్నారు. ఆవుపేడతో దాడి చేసిన తర్వాత కాంట్రాక్టర్ ఈ దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు