UNGA: ఐరాసలో భారత్కు అరుదైన గౌరవం.. ఐఎస్ఏకు పరిశీలక హోదా మంజూరు
ఐరాసలో భారత్కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్తో కలిసి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ)కి ఐరాస జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) తాజాగా పరిశీలక హోదా(అబ్జార్వర్ స్టేటస్)ను మంజూరు చేసింది. ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి...
న్యూయార్క్: ఐరాసలో భారత్కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్తో కలిసి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)కి ఐరాస జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) తాజాగా పరిశీలక హోదా (అబ్జర్వర్ స్టేటస్)ను మంజూరు చేసింది. ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. భాగస్వామ్యాల ద్వారా స్వల్ప వ్యవధిలోనే సానుకూల విధానాలను ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో అనే దానికి ఐఎస్ఏ ఒక ఉదాహరణగా నిలుస్తోందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. సుస్థిర ప్రపంచం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్త మద్దతుకు ఇది సంకేతమని పేర్కొన్నారు.
వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా సౌరశక్తి ఉత్పాదకతను ప్రోత్సహించేందుకు భారత్, ఫ్రాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఐఎస్ఏ రూపుదిద్దుకుంది. 2015లో పారిస్లో జరిగిన కాప్21 సదస్సులో దీన్ని ప్రవేశపెట్టారు. ఐఎస్ఏకి పరిశీలక హోదా ద్వారా.. కూటమికి, ఐరాసకు మధ్య క్రమబద్ధమైన సమన్వయం సాధ్యపడుతుంది. తద్వారా ప్రపంచ ఇంధన రంగం అభివృద్ధికి ప్రయోజనం చేకూరుతుంది. అధికారిక వివరాల ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 80 దేశాలు ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసి, ఆమోదించాయి. 101 దేశాలు కేవలం సంతకం మాత్రమే చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..