Nitin Gadkari: దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ వే పై నితిన్‌ గడ్కరీ టెస్ట్‌డ్రైవ్‌

భారత్‌లో దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే (దిఎంఈ) 2023 మార్చి నాటికి పూర్తవుతుందని తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో... 1350 కి.మీ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి రూ.98వేల కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు గానూ నితిన్‌ గడ్కరీ..

Published : 19 Sep 2021 20:50 IST

దిల్లీ: దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే (దిఎంఈ) 2023 మార్చి నాటికి పూర్తవుతుందని  కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో... 1350 కి.మీ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి రూ.98వేల కోట్లు వెచ్చించగా.. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా ప్రాజెక్టు నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు గానూ నితిన్‌ గడ్కరీ.. కారులో 170కి.మీ వేగంతో ప్రయాణించారు. సాధారణంగా దిల్లీ నుంచి ముంబయి నుంచి వెళ్లాలంటే జాతీయ రహదారి ఎన్‌హెచ్‌48 (1421 కిమీ) ప్రయాణించాల్సి వస్తుంది. దిఎంఈ ఎక్స్‌ప్రెస్‌ హైవే కనుక అందుబాటులో వస్తే ఆ దూరం 70 కి.మీ. వరకు తగ్గుతుందన్నారు. అంతేకాదు.. 25గంటలు పట్టే ప్రయాణం తగ్గనుంది. సుమారు 12గంటలలోపే చేరుకోవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని