Assembly Elections: షెడ్యూల్ ప్రకారమే యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ స్పష్టం
దేశంలో ఒమిక్రాన్ ఉద్ధృతి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్ని వేళ కేంద్ర ఎన్నికల సంఘం నేడు
వాయిదా వేయొద్దని రాజకీయ పార్టీలు కోరాయి: ఎన్నికల సంఘం
లఖ్నవూ: దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల వాయిదా ఉండదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశిల్ చంద్ర గురువారం వెల్లడించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా, పంజాబ్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఆరంభంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో సమావేశమైన ఈసీ.. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లోనూ పర్యటించింది. అక్కడ అన్ని రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయ్యింది. లఖ్నవూలో మీడియా సమావేశం నిర్వహించిన సీఈసీ సుశిల్ చంద్ర.. అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత నిచ్చారు.
‘‘యూపీ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను విన్నాం. ఎన్నికలను వాయిదా వేయొద్దని పార్టీలు కోరాయి. అయితే, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపాయి. అందువల్ల ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని నిర్ణయించాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ నిర్వహిస్తాం. తుది ఓటర్ల జాబితాను జనవరి 5, 2022న విడుదల చేస్తాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లను ఏర్పాటు చేయనున్నాం. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా లైవ్ వెబ్కాస్టింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం’ అని సుశిల్ చంద్ర వెల్లడించారు.
ఓటింగ్ సమయంలో మార్పులు..
ఇక కరోనా దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాక, ఓటర్లు భౌతిక దూరం పాటించేలా పోలింగ్ సమయాన్ని కూడా గంట పెంచుతున్నట్లు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్కు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.
వ్యాక్సినేషన్ను పెంచండి..
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఈసీ పలు సూచనలు చేసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేయాలని తెలిపింది. ఇక, కొవిడ్ బాధితుల కోసం ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సుశిల్ చంద్ర తెలిపారు. ఈసీ తాజా ప్రకటనతో యూపీతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపుర్ శాసనసభల పదవీ కాలాలు వచ్చే మార్చిలో ముగియనున్నాయి. యూపీ అసెంబ్లీ గడువు మే నెల వరకు ఉంది. ఈ ఐదు రాష్ట్రాలకు వచ్చే ఏడాది మార్చి - ఏప్రిల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ సన్నాహాలు చేస్తోంది. జనవరిలో షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి.
అప్పుడే మా పని మొదలు
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పార్టీలు ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. ఓ వైపు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపైనా ఈసీ స్పందించింది. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే తమ బాధ్యత మొదలవుతుందని వెల్లడించింది. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేంద్రం సూచించిన కొవిడ్ మార్గదర్శకాలను అందరూ పాటించేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాతే ఆ బాధ్యత మేం తీసుకుంటాం. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్యశాఖ అధికారులతో చర్చలు జరిపాం. రాష్ట్రంలో 50 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. ఎన్నికల తేదీ ప్రకటన అనంతరం కొవిడ్ను దృష్టిలో ఉంచుకొని వివరంగా మార్గదర్శకాలను జారీ చేస్తాం’’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు