Viral: కత్తితో హడలెత్తించిన కెమికల్ ఇంజినీర్.. గుబులు రేపుతున్న వీడియో
ఐఐటీ పూర్వ విద్యార్థి, కెమికల్ ఇంజినీర్ వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఆలయ సెక్యూరిటీపై దాడికి తెగబడ్డాడు........
గోరఖ్పూర్: ఐఐటీ పూర్వ విద్యార్థి, కెమికల్ ఇంజినీర్ వీరంగం సృష్టించాడు. అందరూ చూస్తుండగానే కత్తితో ఆలయ సెక్యూరిటీపై దాడికి తెగబడ్డాడు. ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఐటీ ముంబయి నుంచి 2015లో కెమికల్ ఇంజినీర్ పట్టాపొందిన అహ్మద్ ముర్టాజా అబ్బాసీ కొద్దిరోజుల క్రితమే స్వస్థలమైన గోరఖ్పూర్ వచ్చాడు. అయితే ఆదివారం రాత్రి స్థానిక గోరఖ్నాథ్ ఆలయం వద్ద ఉన్న ఇద్దరు ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుళ్లపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో అతడిపై రాళ్ల దాడి చేశారు. అనంతరం అతడిని వెంబడించి పట్టుకొని పోలీసుకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
కాగా ఈ ఘటనపై యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోమవారం దర్యాప్తు ప్రారంభించింది. ముంబయి నుంచి అబ్బాసీ గోరఖ్నాథ్ ఆలయం వద్దకు ఎందుకు వచ్చాడో తెలుసుకుంటన్నట్లు గోరఖ్పూర్ ఏడీజీ అఖిల్ కుమార్ తెలిపారు. దర్యాప్తు కోసం నాలుగు పోలీసు బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. అయితే 2017 నుంచే తన కుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేదని ముర్టాజా అబ్బాసీ తండ్రి మహ్మద్ మునీర్ వెల్లడించారు. దీని వల్లే అతడి వివాహం కూడా రద్దయినట్లు తెలిపారు. నగరంతోపాటు అహ్మదాబాద్లోని పలు ఆసుపత్రుల్లో అతడికి చికిత్స చేయించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!