US Corona: మూడు వారాల్లో రెట్టింపైన కేసులు!
అమెరికాలో గతకొద్ది రోజులుగా రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. కేవలం గడిచిన మూడు వారాల్లోనే కేసుల సంఖ్య రెట్టింపయ్యింది.
అమెరికాలో మళ్లీ పెరుగుతోన్న కొవిడ్ ఉద్ధృతి
వాషింగ్టన్: కరోనా వైరస్ దాటికి అగ్రరాజ్యం అమెరికా ఎక్కువగా ప్రభావితమైన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మరణాలు అక్కడే చోటుచేసుకున్నాయి. అయితే, వేగంగా వ్యాక్సిన్ పంపిణీ చేయడంతో వైరస్ తీవ్రత అదుపులోకి వచ్చినట్లు కనిపించింది. కానీ, గతకొద్ది రోజులుగా రోజువారీ కేసులు మళ్లీ పెరిగాయి. కేవలం గడిచిన మూడు వారాల్లోనే కేసుల సంఖ్య రెట్టింపయ్యింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ విస్తృతి, వ్యాక్సినేషన్ రేటు తగ్గడం, జులై 4న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో కొవిడ్ వ్యాప్తి మరోసారి పెరగడానికి కారణమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో..
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 55శాతానికి మించి కనీసం ఒకడోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా కొనసాగుతోంది. అమెరికాలో నిత్యం సరాసరి 260 మంది కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం, అమెరికాలో గతనెల వరకూ రోజువారీ సరాసరి కేసుల సంఖ్య 11వేలుగా ఉంది. కానీ, ప్రస్తుతం అది 23వేలకు చేరింది. మైమీ, దక్షిణ డకోటా రాష్ట్రాల్లో రెండు వారాలుగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మిస్సిసిపిలోనూ కొవిడ్ ఉద్ధృతి మరింత పెరిగింది. గడిచిన మూడు వారాల్లోనే ఆస్పత్రి చేరికలు 150శాతం పెరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
కారణాలు ఇవేనా..?
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో తీసుకున్న వారిలో.. వాటివల్ల వచ్చిన యాంటీబాడీలు కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి పెరగడానికి డెల్టా వేరియంట్ కూడా మరో కారణంగా భావిస్తున్నారు. వీటికితోడు జులై 4న దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన అమెరికా స్వాతంత్ర్య వేడుకలు కూడా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని అనుమానిస్తున్నారు. దీంతో బ్రిటన్లో మాదిరిగానే ఇక్కడ కూడా మరోసారి వైరస్ విజృంభణ కొనసాగుతుందనే ఆందోళన అక్కడి ప్రజల్లో మొదలయ్యింది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ యువకులపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాలు, మరోసారి కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాయి. అంతకుముందు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మాస్కు అవసరం లేదని ప్రకటించిన రాష్ట్రాలు, తాజాగా మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశిస్తున్నాయి. ప్రజలు సమూహాలుగా ఏర్పడడాన్ని తగ్గించుకోవాలని పేర్కొంటున్నాయి.
ఇదిలాఉంటే, ప్రపంచంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా తొలిస్థానంలో ఉంది. ఇప్పటివరకు అక్కడ 3కోట్ల 39లక్షల మందిలో వైరస్ బయటపడగా.. వీరిలో 6లక్షల 8వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!