Ukraine Crisis: ఐరాసలో భారత్ ఓటింగ్కు దూరం.. స్వదేశంలో విమర్శలపై అమెరికా వ్యాఖ్యలు..!
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస సర్వప్రతినిధి సభ బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్ మూడోసారి ఓటింగ్కు దూరంగా ఉంది.
భారత్ ఇప్పుడు ఆ రెండు విషయాల గురించే ఆలోచిస్తోందన్న అగ్రదేశం
వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస సర్వప్రతినిధి సభ బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్ మూడోసారి ఓటింగ్కు దూరంగా ఉంది. దీనిపై అగ్రదేశం అమెరికా స్పందించింది. రష్యా దురాక్రమణను ఖండించే విషయంలో సమిష్టిగా స్పందించాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించింది. ఆ అవసరాన్ని నొక్కిచెప్పేందుకు విదేశాంగ శాఖ భారత్తో సంప్రందింపులు జరుపుతోందని అమెరికా దౌత్యవేత్త డొనాల్డ్ లూ వెల్లడించారు. ఈ సంక్షోభంపై భారత్ స్పష్టమైన స్థానం తీసుకోవాలని కోరేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
‘మా ఆలోచనలన్నీ ఎక్కువగా రష్యా దురాక్రమణ గురించే ఉన్నాయి. రష్యా దాడిని ఖండిస్తూ సమష్టిగా స్పందించాల్సిన ఆవశ్యకతను భారత్కు వివరించేందుకు మా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. మరోపక్క ఈ సమయంలో భారత ప్రభుత్వం రెండు విషయాల గురించి ప్రధానంగా దృష్టిసారించింది. ఒకటి.. ఈ సంక్షోభాన్ని ఇరుదేశాలు దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని కోరుతోంది. అలాగే ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన వేల సంఖ్యలో ఉన్న విద్యార్థుల గురించి ఆందోళన చెందుతోంది. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలను సంప్రదిస్తోంది’ అని డొనాల్డ్ అన్నారు.
భారత్ విలువైన భాగస్వామి..
యూఎన్లో భారత్ ఓటింగ్కు దూరంగా ఉండటంతో అమెరికా నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. దాంతో యూఎస్ విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ముందు డొనాల్డ్ వివరణ ఇచ్చారు. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి వెల్లడించారు. అంతేగాకుండా రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ గురించి ప్రస్తావించారు. ఆ కొనుగోలుపై ఆంక్షల విషయమై బైడెన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ‘నేను చెప్పదల్చుకుందేంటంటే.. భారత్ ఇప్పుడు మనకు ముఖ్యమైన భద్రతా భాగస్వామి. ఆ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం మనకు విలువైందని భావిస్తున్నాం’ ఆయన కమిటీ ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అలాగే గత కొద్దికాలంగా రష్యా నుంచి భారత్ ఆయుధాల దిగుమతులను 53 శాతం తగ్గించిందని, అమెరికా, ఇతర భాగస్వామ్య దేశాల నుంచి రక్షణ కొనుగోళ్లను పెంచిందని గుర్తు చేశారు. అలాగే దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోందని వెల్లడించారు.
భారత్ దాడిని ఖండించనప్పటికీ..
ఇంకోపక్క ఆ దాడి విషయంలో భారత్ స్పష్టమైన వైఖరిని ప్రదర్శించనప్పటికీ.. కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆ దేశం ఉక్రెయిన్కు అండగా నిలుస్తోందన్నారు. మానవీయ సాయం పంపుతామని ప్రకటించిందని చెప్పారు. ఉక్రెయిన్ ప్రభుత్వ అభ్యర్థనకు తగినట్లుగా ఇప్పుడు అదే ముఖ్యమని తెలిపారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించేందుకు అన్ని దేశాలు ఐరాస చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని రష్యా ఉల్లంఘిస్తుండటం పై ఇది భారత్ చేసిన స్పష్టమైన సూచన అని డొనాల్డ్ కమిటీ ముందు తెలియజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
Iran-Israel: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు గర్జించాయి. తాము పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్ ధ్రువీకరించింది. అయితే, తాజా దాడులపై స్పందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం నిరాకరించింది. -
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
Iran-Israel Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఇరాన్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అవి ఇజ్రాయెల్ ప్రతీకార దాడులే అని అగ్రరాజ్య సైనికాధికారులు చెబుతున్నారు. -
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మళ్లీ తడబడ్డారు. రెండో ప్రపంచ యుద్ధంలో తన మావయ్యను నరమాంస భక్షకులు తినేశారంటూ ఆయన చేసిన ప్రసంగంతో మరోసారి బైడెన్ జ్ఞాపకశక్తిపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. -
దోహా విమానాశ్రయం.. ప్రపంచంలో అత్యుత్తమం
ఖతర్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 ఏడాదికిగాను ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా నిలిచింది. -
చైనా మొదట కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే
చైనా అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా అధిపతి బిల్ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
అనారోగ్యాన్ని కలిగిస్తూ, జీవన నాణ్యతపై ప్రభావం చూపుతున్న రుగ్మతల్లో ప్రధానంగా నడుం నొప్పి, కుంగుబాటు సమస్యలు, తలనొప్పి వంటివి ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడైంది. -
ఇండోనేసియాలో అగ్నిపర్వత భారీ విస్ఫోటం
ఇండోనేసియాలో ఓ అగ్నిపర్వతం ఒక్క రోజులోనే 5 సార్లు విస్ఫోటం చెందింది. సులవేసి ద్వీపానికి ఉత్తరం వైపున ఉన్న మౌంట్ రువాంగ్లో బుధవారం విస్ఫోటం సంభవించింది. -
కెనడాలో అతిపెద్ద దోపీడీ కేసులో పురోగతి
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
కెన్యాలో మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో డిఫెన్స్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమొండి ఒగొల్లాతో పాటు మరో 9 మంది ఉన్నతాధికారులు మృతిచెందారు. -
భారీవర్షాల నుంచి తేరుకోని యూఏఈ
అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో ఏర్పడిన కష్టాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గురువారానికి కూడా బయటపడలేదు. -
మీ అణుకేంద్రాలు ఎక్కడున్నాయో మాకూ తెలుసు
ఇజ్రాయెల్ తమ అణ్వాయుధ కేంద్రాలపై దాడి చేయాలని భావిస్తే ఎదురుదాడి తప్పదని ఇరాన్ హెచ్చరించింది. -
రుణం కోసం మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..
బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. -
ఐరాసలో సంస్కరణలకు అమెరికా మద్దతిస్తుంది
భద్రతా మండలి సహా ఐరాసలో అత్యంత అవసరమైన సంస్కరణలకు అమెరికా మద్దతు ఇస్తుందని బైడెన్ యంత్రాంగంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఇజ్రాయెల్తో ఒప్పందానికి వ్యతిరేకంగాగూగుల్ కార్యాలయాల్లో ఆందోళనలు
ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28 మంది ఉద్యోగులను గూగుల్ సంస్థ విధులు నుంచి తొలగించింది. -
ఇరాన్పై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
ఇజ్రాయెల్పై ఇటీవల భారీస్థాయిలో క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్పై గురువారం అమెరికా, బ్రిటన్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించాయి. -
తుర్కియేలో 5.6 తీవ్రతతో భూకంపం
సెంట్రల్ తుర్కియేలో గురువారం మధ్యస్థ తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. టొకాట్ ప్రావిన్స్లోని సులుసరే పట్టణంలో 5.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు