US: భారత్ను ఆకట్టుకునేందుకు.. అమెరికా ‘ఆపరేషన్ ఎయిర్షో’
ఆయుధ కొనుగోళ్ల అంశంలో భారత్ను ఆకట్టుకునేందుకు అమెరికా (US) ప్రయత్నిస్తోంది. తాజాగా బెంగళూరులో జరుగుతున్న వైమానిక ప్రదర్శన (Aero India)లో అగ్రరాజ్యం తొలిసారిగా అత్యాయుధునిక యుద్ధ విమానాలను ప్రదర్శించింది.
ఎయిర్షోలో దూసుకెళ్తున్న అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతున్న 14వ ‘ఏరో ఇండియా (Aero India 2023)’ ప్రదర్శనకు విదేశాల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా (US) తమ అత్యాధునిక ‘ఎఫ్-35 (F-35 F-35 Fighter jets)’ యుద్ధ విమానాలను తొలిసారిగా భారత్కు తీసుకొచ్చింది. వీటితో పాటు ఎఫ్-16, సూపర్ హార్నెట్స్, బి-1బీ బాంబర్లను కూడా ప్రదర్శించింది. అయితే అమెరికా ఉత్సాహం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సైనిక కొనుగోళ్లలో భారత్కు రష్యా (Russia)ను దూరం చేసి దిల్లీని ఆకట్టుకునేందుకు అగ్రరాజ్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
సైనిక కొనుగోళ్ల విషయంలో సోవియట్ కాలం నుంచి భారత్కు రష్యా ప్రధాన ఆయుధ (weapons) సరఫరాదారుగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఇటీవల ఉక్రెయిన్ (Ukraine)పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా నుంచి సరఫరా ఆలస్యమవుతోంది. మరోవైపు సోవియెట్ కాలం నాటి యుద్ధ విమానాలను ఆధునీకీకరించి తమ గగన శక్తిని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే దిల్లీని ఆకట్టుకునేందుకు అమెరికా (US).. ‘ఏరో ఇండియా’ ప్రదర్శనను రెండు చేతులా ఉపయోగించుకుంటోంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ ప్రదర్శనలో అమెరికా ప్రతినిధుల బృందం తమ యుద్ధ విమానాలు, బాంబర్లతో పాల్గొంది.
ఎఫ్-35 యుద్ధ విమానాల గురించి భారత్ (India), అమెరికా (US) మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు. అయినప్పటికీ ఏరో ఇండియాలో తొలిసారిగా వాటిని ప్రదర్శించడం.. దిల్లీతో అమెరికా వ్యూహాత్మక బంధం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. కాగా.. ఈ ఎఫ్-35 యుద్ధ విమానాలను అగ్రరాజ్యం చాలా తక్కువ దేశాలకు ఎంపిక ప్రాధాన్యంలో విక్రయిస్తోంది. భారత్కు వీటిని అందిస్తారా లేదా అన్నదానిపై అమెరికా ఎంబసీ అధికారి రేర్ అడ్మిరల్ మైఖెల్ బేకర్ను ప్రశ్నించగా.. దీనిపై ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా.. గతేడాది ఏరో ఇండియా (Aero India) ప్రదర్శనలో రష్యాకు చెందిన రోసోబోరన్ఎక్స్పోర్ట్ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. ఈ ఏడాది వైమానిక ప్రదర్శనలో మాస్కో పెద్దగా ఉత్పత్తులను ప్రదర్శించలేదు. కేవలం ట్రక్కులు, రాడార్లు, ట్యాంకర్లు వంటివి ప్రదర్శించింది.
బెంగళూరు శివారులోని యలహంక వైమానిక స్థావరం వేదికగా ఫిబ్రవరి 13న మొదలైన ఏరో ఇండియా ప్రదర్శన శుక్రవారం (ఫిబ్రవరి 17)తో ముగియనుంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది. -
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ నూతన అధిపతిగా సదానంద్ వసంత్ దాటే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM