wheat exports: గోధుమల ఎగుమతిపై నిషేధం..సడలింపులిచ్చిన కేంద్రం
విదేశాలకు ఎగుమతి నిమిత్తం కస్టమ్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తోన్న గోధుమల రవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
దిల్లీ: విదేశాలకు ఎగుమతి నిమిత్తం కస్టమ్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తోన్న గోధుమల రవాణాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దేశీయంగా పెరుగుతున్న ధరల నియంత్రణలో భాగంగా గోధుమల ఎగుమతిపై ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది. ఈ క్రమంలో తాజా సడలింపులపై ప్రకటన వెలువడింది.
మే 13 లోగా కస్టమ్ క్లియరెన్స్ కోసం అప్పగించి, సిస్టమ్స్లో రిజిస్టర్ అయిన గోధుమల లోడును ఎగుమతి చేసేందుకు అనుమతులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అంతేగాకుండా ఈజిప్టు ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ దేశానికి ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. దానికి సంబంధించి కాండ్లా పోర్టులో లోడింగ్ జరుగుతోందని తెలిపింది. ఎగుమతులపై నిషేధం ప్రకటనతో గోధుమలు తీసుకొచ్చిన లారీలు పోర్టుల బయట వరుసకట్టాయంటూ నివేదికలు వెలువడ్డాయి. వాటిని పరిశీలించిన కేంద్రం తాజా సడలింపులు ప్రకటించింది.
భారత్ ఆలోచించుకోవాలి: అమెరికా
ఇదిలా ఉంటే.. గోధుమల ఎగుమతిని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అమెరికా కోరుకుంటోంది. ‘భారత ప్రభుత్వ నిర్ణయం గురించి తెలిసింది. ఎగుమతులపై పరిమితులు విధించవద్దని మేం దేశాలను ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే ఈ నిర్ణయాలు ఆహార కొరతను తీవ్రం చేస్తాయి. ఇతర దేశాల ఆందోళనను ఈ దేశాలు వింటాయని ఆశిస్తున్నాం. అలాగే వాటి నిర్ణయాలను పునరాలోచించుకుంటాయని భావిస్తున్నాం’ అంటూ అమెరికా స్పందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..