Indian Navy: ఇండియన్ నేవీలో కీలక పరిణామం.. యుద్ధనౌకపై ల్యాండ్ అయిన ఎంహెచ్-60 హెలికాప్టర్
అమెరికా నుంచి కొనుగోలు చేసిన బహుళ ప్రయోజన హెలికాప్టర్ తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్కతాపై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది.
దిల్లీ: భారతీయ నౌకాదళం కీలక మైలు రాయిని దాటింది. బహుళప్రయోజనకర హెలికాప్టర్ ఎంహెచ్-60.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక ఐఎన్ఎస్-కోల్కతాపై తొలిసారి విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఈ పరిణామం ఇండియన్ నేవీ యాంటీసబ్మెరైన్ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని నేవీ అధికార వర్గాలు వెల్లడించాయి.
అమెరికా తయారు చేసిన ఈ ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్ జలాంతర్గాములపై దాడి చేయడంతోపాటు, నిఘా, యాంటీ షిప్పింగ్, పరిశోధన, రెస్క్యూ ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించే సామర్థ్యమున్నట్లు నౌకాదళం తెలిపింది. భారత నౌకాదళంలోకి ఈ హెలికాప్టర్ను ప్రవేశపెట్టడం ద్వారా రక్షణ రంగంలో భారత్ మరింత శక్తివంతంగా తయారవుతుందని పేర్కొంది. నీటి అంతర్భాగం ద్వారా పొంచి ఉన్న ప్రమాదాలను తిప్పికొట్టడంతోపాటు అత్యవసర సమయాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ హెలికాప్టర్ ఎంతగానో దోహదం చేస్తుందని నేవీ వెల్లడించింది.
విదేశీ ఆయుధ ఉత్పత్తుల విక్రయాల ఒప్పందంలో భాగంగా అమెరికా ప్రభుత్వం నుంచి భారత రక్షణ శాఖ 24 ఎంహెచ్-60ఆర్ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తోంది. వాటికి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కొన్ని పరికరాలను అమర్చి తమకు అనువుగా మార్చుకుంటుంది. తొలి విడతగా 2021 జులైలో అమెరికా నుంచి 2 హెలికాప్టర్లు భారత్కు చేరుకోగా.. తాజాగా వాటిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా