China rocket: రాకెట్‌ కూలేది ఇక్కడే..

చైనా రాకెట్‌ భూమిపై కూలే ప్రాంతాన్ని అమెరికా రక్షణ శాఖ తాజాగా గుర్తించింది. ఆదివారం ఉదయం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) రాకెట్‌ శకలాలు భూమిని.......

Updated : 21 Dec 2022 14:43 IST

వాషింగ్టన్‌: చైనా రాకెట్‌ భూమిపై కూలే ప్రాంతాన్ని అమెరికా రక్షణ శాఖ తాజాగా గుర్తించింది. ఆదివారం ఉదయం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) రాకెట్‌ శకలాలు భూమిని ఢీకొంటాయని అంచనా వేసింది. మధ్య ఆసియాలోని తుర్క్‌మెనిస్థాన్‌లో కూలే అవకాశం ఉందని పేర్కొంది. రాకెట్‌ శకలాలు భూమిని ఢీకొన్న చోట విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే, చైనా మాత్రం ఈ విషయంలో పెద్దగా ప్రమాదం ఉండదనే చెబుతోంది. శకలాలు భూమిని చేరేలోపే పూర్తిగా కాలిపోతాయని, ప్రమాదం జరిగే అవకాశాలు అతి స్వల్పమేనని చెబుతోంది. అయితే, ఎక్కడ పడేదీ వెల్లడించలేదు. గత నెల 29న లాంగ్‌ మార్చ్‌ 5-బీ రాకెట్‌ను చైనా ప్రయోగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని