యూఎస్‌ను తలదన్నేందుకు చైనా అడ్డదారులు!

వైద్య రంగంలో అమెరికాను తలదన్నేందుకు చైనా అడ్డదారులు తొక్కుతోందని అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో హ్యాకింగ్‌ ద్వారా అమెరికాకు సంబంధించిన వైద్య సమాచారాన్ని తస్కరించడాన్ని చైనా ముమ్మరం చేసిందని యూఎస్‌ నేషనల్‌ కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీస్‌ సెంటర్‌ (ఎన్‌సీఎస్సీ) వెల్లడించింది.

Published : 04 Feb 2021 01:45 IST

వాషింగ్టన్‌: వైద్య రంగంలో అమెరికాను తలదన్నేందుకు చైనా అడ్డదారులు తొక్కుతోందని అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో హ్యాకింగ్‌ ద్వారా అమెరికాకు సంబంధించిన వైద్య సమాచారాన్ని తస్కరించడాన్ని చైనా ముమ్మరం చేసిందని యూఎస్‌ నేషనల్‌ కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ సెక్యూరిటీస్‌ సెంటర్‌ (ఎన్‌సీఎస్సీ) వెల్లడించింది. ముఖ్యంగా అమెరికన్ల డీఎన్‌ఏకి సంబంధించిన ముఖ్య సమాచారాన్ని హ్యాకింగ్‌ ద్వారా చైనా తస్కరిస్తోందని ఆరోపిస్తూ.. ఆ దేశంపై మండిపడింది. చైనాకు చెందిన బీజీఐ అనే బయోటెక్నాలజీ సంస్థ చాలా దేశాల్లో కొవిడ్‌ టెస్టుల కిట్లను విక్రయించిందని పేర్కొన్న ఎన్‌సీఎస్సీ.. గత ఆరునెలల్లోనే ఆ సంస్థ18 టెస్టింగ్‌ ల్యాబ్‌లను నెలకొల్పినట్లు వివరించింది. 

అమెరికా బయోటెక్నాలజీ రంగాన్ని తలదన్ని పైకి ఎదిగేందుకు ఈ సమాచారాన్ని చైనా ప్రభుత్వం ఉపయోగిస్తోందని అమెరికా పేర్కొంది. వైద్య సమాచారాన్ని కొల్లగొట్టడం వల్ల అమెరికన్ల గోప్యతకు భంగం వాటిల్లడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు, దేశభద్రతకూ విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఎన్‌సీఎస్సీ హెచ్చరించింది. మరోవైపు చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ఇప్పటికే 80 శాతం అమెరికన్‌ యువత వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని తస్కరించిందని ఎన్‌సీఎస్సీ మాజీ డైరెక్టర్‌ ఒకరు ఆరోపించడం గమనార్హం.  

ఇదీ చదవండి

రాజ్యసభలో ఫోన్‌ వాడొద్దని తెలియదా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని