మయన్మార్‌ వెనక్కి తగ్గకుంటే ఆంక్షలు: బైడెన్‌ 

మయన్మార్‌ కీలక నేత, నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ నాయకురాలు, నోబెల్‌ శాంతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ సహా ఆ పార్టీ కీలక నేతలను ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి, అమెరికా ఖండించాయి. మయన్మార్‌

Updated : 02 Feb 2021 01:01 IST

అమెరికా: మయన్మార్‌ కీలక నేత, నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ నాయకురాలు, నోబెల్‌ శాంతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ సహా ఆ పార్టీ కీలక నేతలను ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి, అమెరికా ఖండించాయి. మయన్మార్‌ మిలిటరీ వెనక్కి తగ్గకుంటే ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణకు అమెరికా కృషి చేస్తుందని బైడెన్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టవద్దని బైడెన్‌ సూచించారు. మయన్మార్‌ సైన్యం చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా బైడెన్‌ వర్ణించారు.

మయన్మార్‌ పార్లమెంట్‌కు గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్‌ సూకీకి చెందిన నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ పార్టీ  476 స్థానాలకు గానూ.. 396 స్థానాలు కైవసం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు చట్టసభ్యులు సోమవారం నేపిడాలో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని భావిస్తూ ఆ దేశం సైన్యం ఆంగ్‌సాన్‌ సూకీ సహా ఇతర కీలక నేతలను అదుపులోకి తీసుకొని గృహనిర్బంధం విధించింది. ఏడాది పాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని మయన్మార్‌ సైన్యం వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని