నిరసనల్ని ఆ కోణంలోనే చూడాలి: భారత్‌

దేశంలో జరిగే నిరసనల్ని భారత ప్రజాస్వామ్య విలువల కోణంలోనే చూడాలని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. దిల్లీలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై యూఎస్‌ స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మీడియా సమావేశంలో గురువారం పలు విషయాలు వెల్లడించారు.

Published : 04 Feb 2021 23:14 IST

దిల్లీ: దేశంలో జరిగే నిరసనల్ని భారత ప్రజాస్వామ్య, రాజకీయ విలువల కోణంలోనే చూడాలని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్‌లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలపై అమెరికా‌ గురువారం స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘దేశంలో జరిగే నిరసనల్ని భారత ప్రజాస్వామ్య విలువలకు లోబడే చూడాలి. రైతుల ఆందోళనలను పరిష్కరించే దిశగా భారత ప్రభుత్వం సంబంధిత రైతు సంఘాలతో కలిసి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల అమెరికా క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి అక్కడ ఎలాంటి మనోభావాలను రేకెత్తించిందో.. భారత్‌లో జనవరి 26న చారిత్రక ఎర్రకోట విధ్వంసం కూడా ఇక్కడి ప్రజల్లో అదే తరహా మనోభావాల్ని రేకెత్తించింది. హింసాత్మక ఘటనలు చెలరేగకుండా అడ్డుకునేందుకే రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవల్ని ప్రభుత్వం నిలిపివేసింది’ అని శ్రీవాస్తవ తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో భారత్‌ తీసుకుంటున్న సంస్కరణల్ని అమెరికా గుర్తించిన విధానాన్ని అనురాగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

భారత్‌లో నూతనంగా తెచ్చిన సాగు చట్టాలపై యూఎస్‌ ప్రభుత్వం గురువారం స్పందించిన విషయం తెలిసిందే. సాగు రంగంలో భారత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఇక్కడి రైతులకు మార్కెట్‌ పరిధిని విస్తరించేందుకు తోడ్పడుతాయని పేర్కొంది. అంతేకాకుండా ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆకర్షించేందుకు మంచి మార్గమని తెలిపింది. చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలను ఉద్దేశిస్తూ.. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని అమెరికా సూచించింది.

ఇదీ చదవండి 

సాగు చట్టాలపై భారత్‌కు అమెరికా మద్దతు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని