Afghan Crisis: తాలిబన్లకు అమెరికా మరో షాక్..!
అఫ్గానిస్థాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. అఫ్గానిస్థాన్ ప్రభుత్వానికి ఆయుధాల విక్రయాలను నిలిపివేయాలని......
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లకు అమెరికా మరో షాక్ ఇచ్చింది. అఫ్గానిస్థాన్ ప్రభుత్వానికి ఆయుధాల విక్రయాలను నిలిపివేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిఫెన్స్ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీచేసింది. ఇప్పటికే ఆఫ్గాన్కు పంపకుండా పెండింగ్లో ఉన్న, ఇంకా పంపిణీ చేయని ఆయుధాల బదిలీని సమీక్షించనున్నట్టు అమెరికా రాజకీయ/మిలటరీ వ్యవహారాల బ్యూరో ఓ ప్రకటనలో పేర్కొంది. అఫ్గానిస్థాన్లో శరవేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ శాంతి, జాతీయ భద్రత, అమెరికా విదేశాంగ విధానం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్న, ఎగుమతి చేసిన ఆయుధాల లైసెన్సులను ఆమోదాన్ని డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సేల్స్ కంట్రోల్స్ సమీక్షిస్తోందని తెలిపింది. రాబోయే రోజుల్లో రక్షణ సంబంధిత పరికరాల ఎగుమతిదారుల కోసం ప్రత్యేక మార్పుల సమాచారం జారీచేయనున్నట్టు తెలిపింది.
మరోవైపు, ఇప్పటికే అఫ్గాన్కు సంబంధించిన సుమారు రూ.70,500 కోట్లు (950 కోట్ల డాలర్లు) నిధులను అమెరికా స్తంభింపజేసిన విషయం తెలిసిందే. తాలిబన్ల చేతికి నిధులుఅందకుండా చేసేందుకు ప్రత్యేక ఆంక్షలు పెట్టింది. తాలిబన్లపై ఒత్తిడి తెచ్చేందుకు మరిన్ని చర్యల్లో భాగంగా ఇప్పుడు ఆయుధాల విక్రయాలను నిలిపివేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్