
భారత్కు యూఎస్ 100మి.డాలర్ల వైద్య సామగ్రి
వాషింగ్టన్: కరోనాపై పోరులో భారత్కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. భారత్కు వంద మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శ్వేతసౌధం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు కొనసాగుతున్న ప్రయత్నాల్ని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ బుధవారం ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత్కు సాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంది. భారత్లో ఆరోగ్య కార్యకర్తలకు శక్తిమేరకు సాయం చేస్తాం. కొవిడ్కు సంబంధించిన అత్యవసర పరికరాలు గురువారం భారత్కు బయలుదేరనున్నాయి. వాటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల ఎన్-95 మాస్కులు, 1 మిలియన్ ర్యాపిడ్ కిట్లు పంపనున్నాం. అంతేకాకుండా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీ సామగ్రిని భారత్కు పంపుతున్నాం. అది 20 మిలియన్ డోసులు తయారీకి ఉపయోగపడుతుంది. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే యూఎస్ ఎయిడ్ కింద 23 మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నాం. అంతేకాకుండా యూఎస్ ఎయిడ్ తరపున త్వరలో వెయ్యి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేస్తాం’ అని శ్వేతసౌధం వెల్లడించింది.
మరోవైపు, రష్యా నుంచి వైద్య పరికరాలు, ఇతర సామగ్రి భారత్ చేరుకునర్నాయి. రెండు విమానాల్లో సుమారు 20 టన్నుల వస్తువులను రష్యా పంపించింది. కరోనా వ్యాప్తి నివారణ, వైద్య సదుపాయాల కల్పనకు రష్యా సహకారం అందిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KTR: యశ్వంత్ సిన్హా నామినేషన్కు మంత్రి కేటీఆర్.. దిల్లీకి పయనం
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
-
Politics News
Maharashtra crisis: సుప్రీంకు చేరిన ‘మహా’ పంచాయితీ.. పిటిషన్ దాఖలు చేసిన రెబల్స్
-
India News
PM modi: భారత ప్రజాస్వామ్యంపై ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. ఎన్నారైల సమావేశంలో మోదీ
-
Business News
GST: క్యాసినో, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందేలపై 28శాతం జీఎస్టీ!
-
India News
Maharashtra Crisis: ఏక్నాథ్ గూటికి మరో మంత్రి.. అస్సాం క్యాంపులో 9కి చేరిన మంత్రులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం
- R Madhavan: మాధవన్పై నెటిజన్ల విమర్శలు.. సైన్స్ తెలియకపోతే సైలెంట్గా ఉండు..!
- AP Liquor: మద్యంలో విషం
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- Jamun Health Benefits: నేరేడు పండు తింటున్నారా?ప్రయోజనాలివే!