In Pics: నేనూ అమ్మనే కదా..! అఫ్గాన్ పసికందులను లాలిస్తున్న విదేశీ సైనికులు
ఓవైపు కన్నపేగు మమకారం.. మరోవైపు తాలిబన్ల చెర నుంచి తమ కంటిపాపలను కాపాడుకోవాలనే ఆరాటం.. వెరసి ఆ తల్లులు తమ గుండెను రాయి చేసుకున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఓవైపు కన్నపేగు మమకారం.. మరోవైపు తాలిబన్ల చెర నుంచి తమ కంటిపాపలను కాపాడుకోవాలనే ఆరాటం.. వెరసి ఆ తల్లులు తమ గుండెను రాయి చేసుకున్నారు. మనసులో మెలిపెడుతున్న రంపపు కోతను పంటి బిగువున పట్టి కన్నబిడ్డలను పరాయి దేశానికి పంపించేందుకు సిద్ధమయ్యారు. కనీసం తమ పిల్లలనైనా కాపాడాలంటూ విదేశీ దళాలను వేడుకుంటున్నారు. ఆ తల్లుల వేదన భద్రతా దళాల మనసును కరిగించింది. అందుకే ఆ చిన్నారులను అక్కున చేర్చుకుని లాలించారు. కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలు కోకొల్లలు..!
తాలిబన్ల ఆక్రమణలతో అఫ్గానిస్థాన్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ముష్కరుల అరాచక పాలన ఎరిగిన అఫ్గాన్ వాసులు ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని కాబుల్ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. అయితే తాలిబన్లు వారిని అడ్డుకుని ఎయిర్పోర్టుకు వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు.. కనీసం తమ తర్వాతి తరాన్నైనా తాలిబన్ల నుంచి కాపాడుకోవాలని ఆరాపడుతున్నారు. ఇనుప కంచెల పైనుంచే తమ పిల్లలను ఎయిర్పోర్టులో ఉన్న అమెరికా, బ్రిటన్ దళాలకు అప్పగిస్తున్నారు. ఆ చిన్నారులను విదేశీ బలగాలు కూడా అక్కున చేర్చుకుంటున్నాయి.
విదేశీ భద్రతా సిబ్బంది ఆ శిశువులను ఎత్తుకుని లాలిస్తున్నారు. కుటుంబాలకు దూరంగా కల్లోల ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ సైనికులు.. ఈ పసిపాపల బోసినవ్వులు చూడగానే తమ బిడ్డలను గుర్తుచేసుకుంటున్నారు. అఫ్గాన్ వాసుల పిల్లలను సైనికులు ఎత్తుకుని ఆడిస్తున్న చిత్రాలు, వారికి సాయం చేస్తున్న దృశ్యాలు యావత్ ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.
కల్లోలంలో కరుణచూపి..
కాబుల్ విమానాశ్రయంలో ఓ పసికందును ఇనుప కంచెపై నుంచి సైనికులు తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చారు. అయితే లోపలికి అనుమతి లేకపోవడంతో గేటు వద్ద నిరీక్షించారు. ఆ సమయంలో చిన్నారి అనారోగ్యానికి గురవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అమెరికా దళాల సాయం కోరారు. వెంటనే స్పందించిన యూఎస్ భద్రతా సిబ్బంది ఆ చిన్నారిని కంచెపై నుంచి తీసుకుని ఎయిర్పోర్టు ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి చికిత్స అందించిన అనంతరం ఆ శిశువును తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. కల్లోల పరిస్థితుల్లోనూ ఆ భద్రతాసిబ్బంది మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ శిశువుకు సాయం చేసిన తీరు ప్రశంసనీయమే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం