US Visa: వీసా రెన్యువల్కు నో మెయిల్.. ఓన్లీ డ్రాప్ బాక్స్!
యూఎస్ వీసా (US Visa) రెన్యువల్ చేయాలను కునేవారు డ్రాప్ బాక్స్ (Drop Box) ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, మెయిల్స్ ద్వరా వచ్చిన దరఖాస్తులను స్వీకరించబోమని భారత్లోని అమెరికా దౌత్యకార్యాలయం వెల్లడించింది.
ముంబయి: అమెరికా (USA) వీసా రెన్యువల్ చేయాలనుకునేవారు డ్రాప్బాక్స్ (Drop Box) ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని భారత్లోని అమెరికా దౌత్యకార్యాలయం (US Embassy) ప్రకటిచింది. మెయిల్స్ ద్వారా వీసా రెన్యువల్ చేయడాన్ని స్వాగతించబోమని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థుల ప్రశ్నకు బదులిచ్చింది. మరోవైపు ఈ ఏడాదిలో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు మంజూరు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ముంబయిలో యూఎస్ కాన్సులేట్ జనరల్ జాన్ బల్లార్డ్ వెల్లడించారు. ‘‘యూఎస్ వీసాల కోసం ఈ ఏడాది భారత్ నుంచి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నాం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం.’’ అని జాన్ బల్లార్డ్ తెలిపారు. 2022లో 1,25,000 విద్యార్థి వీసాలను మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.
వీసా మంజూరు, రెన్యువల్కు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సిబ్బందిని పెంచడంతో పాటు ‘డ్రాప్ బాక్స్’ విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. డ్రాప్ బాక్స్ విధానంలో.. ఇంటర్వ్యూ లేకుండా వీసా రెన్యువల్కు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్లుగా అమెరికా వీసా ఉన్నవారు ఇందుకు అర్హులు. వెల్లువెత్తుతున్న వీసా దరఖాస్తులను దృష్టిలో ఉంచుకొని భారత్లోని యూఎస్ ఎంబసీ గత నెలలో ప్రత్యేక చర్యలు మొదలు పెట్టింది. మొదటిసారి వీసా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహణతోపాటు నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు దేశ వ్యాప్తంగా సిబ్బందిని పెంచుతోంది. ఇందులో భాగంగానే భారత్లోని కాన్సులేట్ కార్యకలాపాలను వేగవంతం చేసింది. దిల్లీలోని యూఎస్ ఎంబసీతోపాటు ముంబయి, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని కాన్సులేట్ కేంద్రాల్లోనూ ప్రతి శనివారం వీసా దరఖాస్తు దారులకు ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని జనవరి 21న లాంఛనంగా ప్రారంభించారు.
వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నామని యూఎస్ ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా రానున్న రోజుల్లో పదుల సంఖ్యలో కాన్సులేట్ ఆఫీసర్లను తాత్కాలిక ప్రాతిపదికన భారత్కు తీసుకు రానున్నట్లు వెల్లడించింది. వీసా జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?