Afghan Crisis: తాలిబన్లతో డీల్ ట్రంప్ది.. ఫినిషింగ్ బైడెన్ది!
అఫ్గానిస్థాన్ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడ తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దశాబ్దాల కిందట అరాచక పాలనే మళ్లీ మగ్గిపోవాల్సి వస్తుందని అక్కడి జనం ప్రాణభయంతో.......
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడ తీవ్ర కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దశాబ్దాల కిందట ఉన్న అరాచక పాలనలో మళ్లీ మగ్గిపోవాల్సి వస్తుందని అక్కడి జనం ప్రాణభయంతో భీతిల్లిపోతున్నారు. బతుకు జీవుడా.. అంటూ తమ దేశం వదిలి పారిపోతున్న దృశ్యాలు ప్రపంచ దేశాలను కలిచివేస్తున్నాయి. అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడం వల్లే తాలిబన్ ఫైటర్లు మెరుపు దాడులతో కాబుల్ను వశపరచుకోవడంతో ఇలాంటి భీతావహ వాతావరణం నెలకొందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. తాలిబన్లతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ దాన్ని అమలుచేయడమే ఇందుకు కారణం. అయితే, 20 ఏళ్ల కాలంలో అమెరికా సైన్యం చేతిలో శిక్షణ పొందిన అఫ్గాన్ సైన్యం ఎందుకు తాలిబన్ ఫైటర్లను ఎదుర్కోలేకపోయింది? అగ్రరాజ్యం అండదండలు ఉన్నా అఫ్గన్ ప్రభుత్వం తాలిబన్ ఫైటర్ల ముందు ఎందుకు మోకరిల్లాల్సి వచ్చిందన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
ఏమిటీ ఒప్పందం?
అఫ్గాన్లో సుస్థిర శాంతిని నెలకొల్పే ఉద్దేశంతో అమెరికా, తాలిబన్ల మధ్య గతేడాది ఫిబ్రవరిలో ఖతార్ రాజధాని దోహా వేదికగా చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. 135 రోజుల్లోపు అమెరికా మిత్ర దేశాలు తమ సేనల సంఖ్యను 8600లకు తగ్గించుకోవాలి. అలాగే, 14 నెలల్లోపు మొత్తం బలగాలను ఉపసంహరించుకొనేలా ఒప్పందం కుదిరింది. వేలాది మంది ఖైదీల అప్పగింతకు కూడా ఇరు దేశాలూ పరస్పరం అంగీకరించడంతో పాటు ఇరు ప్రతినిధులూ సంతకాలు చేశారు. అప్పడు అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న మైక్ పాంపియో పర్యవేక్షణలో తాలిబన్లతో ఈ ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా అల్ఖైదాతో తాలిబన్లు పూర్తిగా సంబంధాలను తెంచుకోవాలని కూడా అమెరికా షరతు విధించింది. అయితే, ఈ ఒప్పందంలో అఫ్గన్ ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయకుండా ఏకపక్షంగా సాగడం ఆందోళనకర పరిణామం. ఒప్పందంలో భాగంగా తాలిబన్ల స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయబోమని హమీ ఇవ్వడంతో తాలిబన్లకు తిరిగి ఊపిరి వచ్చినట్టయింది. ఈ ఒప్పందం అమలవుతున్న తరుణంలో చోటుచేసుకున్న పరిణామాలు తాలిబన్లను మరింత బలోపేతం చేశాయి. వైమానిక దాడులు నిలిచిపోవడంతో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిఉన్న తాలిబన్ ఫైటర్లు, సానుభూతిపరుల పునరేకీకరణ జరిగింది. దీంతో పుంజుకొని అఫ్గాన్ ప్రజా ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన తాలిబన్లు ఎవరి ఊహలకు అందనంతగా మెరుపు వేగంతో కాబుల్ను ఆక్రమించి తమ జెండా పాతేశారు.
అఫ్గాన్ సైన్యం ఎందుకు మోకరిల్లింది?
అమెరికా సాయంగా సమకూర్చిన ఆయుధాలు, నిధులతో రెండు దశాబ్దాలుగా అఫ్గాన్ సైన్యం ఎంతో రాటుతేలిందని భావించినా అదంతా వృథాగానే మిగిలిపోయింది. ఆ సైన్యం తాలిబన్ ఫైటర్లను దీటుగా ఎదుర్కోలేకపోయింది. కొందరు సైనికులు అవినీతికి అలవాటుపడిపోవడం, తాలిబన్లకు పావులుగా మారడంతో ఈ సంక్షోభ సమయంలో దీటుగా ఎదుర్కోలేక చతికిలపడిపోయారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అఫ్గాన్ అధ్యక్షుడిగా కొనసాగిన అష్రఫ్ ఘనీ కూడా తక్కువేం తినలేదు. ఆయన దేశంలోని ఉత్తర ప్రాంతంలో బలీయశక్తిగా ఉన్న నార్తర్న్ అలయన్స్ (ఉత్తర కూటమి)ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. దీంతో 2001లో అమెరికాకు సహకరించిన ఉత్తరకూటమి ప్రస్తుతం పోరాడే సత్తా లేక పూర్తిగా చతికిలపడింది. ఇరాక్లోనూ తొలినాళ్లలో ఇలాంటి పరిస్థితులే ఏర్పడినా ఆ దేశ సైన్యం తిరిగి పుంజుకోవడంతో ఐసిస్పై విజయం సాధించింది. అయితే అఫ్గాన్ సేనలో అంకితభావం, పోరాట పటిమ, దేశభక్తి లేకపోవడం.. తదితర కారణాలతో ఒక్క తూటా కాల్చకుండానే తాలిబాన్లకు లొంగిపోయింది.
విమర్శల్ని తిప్పికొట్టిన అమెరికా
మరోవైపు, అఫ్గాన్ విషయంలో బైడెన్ విఫలమయ్యారన్న విమర్శల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. అఫ్గాన్ సేనల చేతకానితనమే తాలిబన్ల ఆధిపత్యానికి కారణమైందని అగ్రరాజ్యం జాతీయ భద్రత సలహాదారు జేక్ సూల్లివన్ పేర్కొన్నారు. అఫ్గాన్లో రెండు దశాబ్దాల పాటు కొనసాగిన యుద్ధాన్ని మూడో దశాబ్దంలోనూ చూడాలని బైడెన్ భావించలేదన్నారు. ఇన్నేళ్లుగా అఫ్గాన్ సేనలకు శిక్షణ, వందల కోట్ల డాలర్ల నిధులు అందించిన తర్వాత ప్రభుత్వ సైన్యమే తమ దేశాన్ని కాపాడుకోవాల్సి ఉంటుందని బైడెన్ భావించారన్నారు. అందుకే అమెరికా దళాల ఉపసంహరణ నిర్ణయానికి బైడెన్ కట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ పరిస్థితికి బైడెనే కారణమని ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైఫల్యమన్నారు. బైడెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ట్రంప్ అధికారంలో ఉండి తాను విదేశాంగ మంత్రిగా ఉంటే తాలిబన్లకు అమెరికా గుణపాఠం నేర్పిఉండేదని పాంపియో వ్యాఖ్యానించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!