Kalyan Singh: యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ కన్నుమూత
భాజపా సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో.....
లఖ్నవూ: భాజపా సీనియర్ నేత, ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో లఖ్నవూలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తన 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కీలక పదవులు అలంకరించారు. భాజపా మూల సిద్ధాంతం హిందుత్వను బలంగా వినిపించారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ఎంపీగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్గా సేవలందించారు. ఆయనకు కుమారుడు రాజ్వీర్ సింగ్, కుమార్తె ప్రభా వర్మ ఉన్నారు. రాజ్వీర్ సింగ్ ప్రస్తుతం ఏత్ నియోజకవర్గం నుంచి భాజపా ఎంపీగా కొనసాగుతున్నారు.
కల్యాణ్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదీ..
కల్యాణ్ సింగ్ 1932, జనవరి 5న తేజ్పాల్ సింగ్ లోధి, సీతాదేవి దంపతులకు యూపీలోని అలీగఢ్ జిల్లా మధౌలీ గ్రామంలో జన్మించారు. 60 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అరుదైన నేతగా కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలిచారు. ఆరెస్సెస్ నుంచి రాజస్థాన్ గవర్నర్ దాకా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన రాజకీయ ప్రస్థానంలో మలుపులెన్నో. 1957లో ఆరెస్సెస్ ప్రచారక్గా మొదలై ఆ తర్వాత జన్సంఘ్లో చేరడం ద్వారా రాజకీయ జీవితానికి పునాది వేసుకున్నారు. 1967లో అత్రౌలి నియోజకవర్గం నుంచి భారతీయ జన్సంఘ్ తరఫున పోటీచేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పట్నుంచి వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగించిన కల్యాణ్ సింగ్కు 1980లో బ్రేక్ పడింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) నేత అన్వర్ఖాన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతోనే పరాజయం చవిచూశారు. ఆ తర్వాత 1985లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి భాజపా తరఫున బరిలో దిగి 1996 వరకు విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1967 నుంచి 2002 మధ్య కాలంలో అత్రౌలి నుంచి 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2002లో మాత్రం తాను స్థాపించిన రాష్ట్రీయ క్రాంతి పార్టీ తరఫున బరిలో నిలిచి గెలిచారు. ఈ క్రమంలోనే 1977-79లో యూపీ ఆరోగ్యమంత్రిగా, రెండు పర్యాయాలు సీఎంగా సేవలందించారు.
అయోధ్య ఘటనతో సీఎం పదవికి రాజీనామా
ఇందిరా గాంధీ అమలుచేసిన ఎమర్జెన్సీ కాలంలో 21 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 1991 జూన్లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయంతో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయోధ్యను దర్శించి రామమందిర నిర్మాణానికి ప్రతిన బూనారు. కల్యాణ్సింగ్ సీఎంగా ఉన్నప్పుడే బాబ్రీ మసీదు ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనతో సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం 1993 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అత్రౌలి, కాస్గంజ్ అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో దిగి రెండు చోట్లా విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భాజపా ఓటమిపాలైంది. దీంతో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత 1997లో జరిగిన ఎన్నికల్లో భాజపా గెలుపుతో మళ్లీ సీఎం అయ్యారు.
భాజపాను వీడి.. వాజ్పేయీ కోరడంతో మళ్లీ సొంతగూటికి..
భాజపాతో విభేదాలు తలెత్తడంతో 1999లో కాషాయ దళాన్ని వీడి సొంతంగా రాష్ట్రీయ క్రాంతి పార్టీని స్థాపించారు. 2004లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ కోరడంతో మళ్లీ భాజపాలో చేరారు. తన పార్టీని కూడా విలీనం చేశారు. అదే సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బులంద్షెహర్ నియోజకవర్గం నుంచి భాజపా టికెట్పై పోటీ చేసి గెలిచారు. 2009 జనవరి 20న భాజపాను మళ్లీ వీడి స్వతంత్ర అభ్యర్థిగా ఇటా లోక్సభ స్థానం నుంచి బరిలో దిగి తన సత్తా చాటారు. అనంతరం తన కుమారుడు రాజ్వీర్ సింగ్తో కలిసి సమాజ్వాదీ పార్టీలో చేరారు.
అయితే, 2009 నవంబర్ 14న ఫిరోజాబాద్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీనికి కల్యాణ్ సింగే కారణమని, ఆయన వల్లే ముస్లింల ఓట్లు రాలేదని ములాయంసింగ్ యాదవ్ నిందించడంతో 2010లో ఆ పార్టీకి గుడ్బై చెప్పి జన్క్రాంతి పేరిట జనవరి 5, 2010న కొత్త పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2013 జవనరి 21న ఆ పార్టీని కూడా రద్దు చేశారు. 2013లో మరోసారి భాజపాలోనే చేరారు. సెప్టెంబర్ 4, 2014న ఆయన రాజస్థాన్ గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసి 2019 సెప్టెంబర్ 8 వరకు కొనసాగారు. అదే కాలంలో 2015 జనవరి 28న హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు.
ప్రధాని మోదీ సంతాపం
కల్యాణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆయన దూరం కావడం మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంది. కల్యాణ్ సింగ్ అట్టడుగు స్థాయి నుంచి గొప్ప నేతగా ఎదిగారు. రాజనీతిజ్ఞుడు, మానవతా విలువలున్న వ్యక్తి అని కొనియాడారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో కల్యాణ్ సింగ్ పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ