Uttarakhand: ఉత్తరాఖండ్.. అసెంబ్లీ పోరుకు సిద్ధమైన దేవభూమి
దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 13 జిల్లాల్లోని 70 శాసనసభ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది.
70 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్
దేహ్రాదూన్: దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 13 జిల్లాల్లోని 70 శాసనసభ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. దాదాపు 81లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల బరిలో 632 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా వీరిలో 152 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకూ అక్కడ పోలింగ్ జరగనుంది. బహిరంగ సభలు, వర్చువల్ ప్రసంగాలు, ఇంటింటి ప్రచారంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముగించాయి. 2000 సంవత్సరంలో కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇది ఐదోసారి.
ఎన్నికల బరిలో ప్రముఖులు..
అధికార పార్టీ తరపున ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి, కేబినెట్ మంత్రులు సత్పాల్ మహరాజ్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, ధాన్సింగ్ రావత్తోపాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్ వంటి ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్, మాజీ మంత్రి యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గొడియాల్తోపాటు ప్రీతం సింగ్ వంటి సీనియర్ నేతలు పోటీలో ఉన్నారు. ఈసారి ఉత్తరాఖండ్లో ఎన్నికల బరిలో నిలిచిన ఆమ్ఆద్మీ పార్టీతోపాటు సమాజ్వాదీ పార్టీలు కూడా ముమ్మరంగానే ప్రచారం నిర్వహించాయి.
ప్రచారంలో జాతీయ నేతలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, యోగీ ఆదిత్యనాథ్లు ప్రచారంలో పాల్గొనగా.. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి జాతీయ నేతలు ప్రచారం నిర్వహించారు. ఆమ్ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
ఉత్తరాఖండ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ విజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 57 సీట్లలో గెలుపొందింది. కాంగ్రెస్ మాత్రం కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. గతకొన్నేళ్లుగా భాజపా, కాంగ్రెస్ల మధ్యే ప్రధాన పోటీ ఉంటోన్న ఉత్తరాఖండ్లో.. ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే సమయంలో ఈసారి ఆమ్ఆద్మీ పార్టీ బరిలో నిలవడం ఆ రెండు పార్టీలకు సవాల్గా మారినట్లు తెలుస్తోంది. మొత్తం 70 స్థానాల్లో ఆమ్ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను రంగంలోకి దించింది.
ఎవరి ధీమా వారిదే..
రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే, రహదారుల నిర్మాణంతో పాటు కేదారినాథ్ ఆలయ పునర్నిర్మాణం వంటి హామీలతో భాజపా ప్రచారం చేసింది. అందుకే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. మరోవైపు భాజపా హయాంలో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నాలుగు నెలల్లోనే ముగ్గురు ముఖ్యమంత్రుల మార్పు వంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇక కొత్తగా వచ్చిన ఆమ్ఆద్మీ మాత్రం రాష్ట్రం ఏర్పడి రెండు దశాబ్దాలైనా.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాజపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించింది. ఆమ్ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 18ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం, ప్రతి కుటుంబానికి ఓ ఉద్యోగం, రూ.5వేల నిరుద్యోగ భృతి వంటి హామీలను ఆప్ ప్రకటించింది.
ఇక రాష్ట్రంలో 81లక్షలకుపైగా ఓటర్లు ఉండగా వీరికోసం 11,697 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సౌజన్య వెల్లడించారు. మహిళల కోసం ‘సఖి’ పోలింగ్ బూత్ పేరుతో తొలిసారి 101 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని.. ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడంలో భాగంగా ఈ ఏర్పాటు చేశామని చెప్పారు. వీటితోపాటు దివ్యాంగుల కోసం పలుచోట్ల ప్రత్యేక పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశామని, ఆ కేంద్రాల్లోని సిబ్బంది కూడా దివ్యాంగులే ఉంటారని రాష్ట్ర ఎన్నికల అధికారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?