Vaccination: లక్ష్యం చేరాలంటే.. 5 రెట్లు పెంచాలి!
వచ్చే డిసెంబర్ నాటికి దేశంలోని ప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ లక్ష్యం చేరుకోవాలంటే దేశంలో రోజువారీ వ్యాక్సినేషన్ను 5 రెట్లు పెంచాల్సి ఉంటుందని ఓ ఆంగ్ల పత్రిక నివేదికలో తేలింది. ప్రస్తుత దేశ జనాభా, వ్యాక్సిన్ పంపిణీ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ముఖ్యంగా
దిల్లీ: వచ్చే డిసెంబర్ నాటికి దేశంలోని ప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ లక్ష్యం చేరుకోవాలంటే దేశంలో రోజువారీ వ్యాక్సినేషన్ను 5 రెట్లు పెంచాల్సి ఉంటుందని ఓ ఆంగ్ల పత్రిక తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుత దేశ జనాభా, వ్యాక్సిన్ పంపిణీ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ను మరింత పెంచాలని నివేదిక సూచిస్తోంది.
ఉత్తర్ప్రదేశ్లో గత ఐదు నెలల్లో 12శాతం మంది కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు, 2.5 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. సరాసరి రోజుకు 1.4లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ఈ రాష్ట్రంలో రోజుకు 13.2లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. బిహార్ విషయానికొస్తే ఇప్పటి వరకు 12.6శాతం మంది ప్రజలు కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోగా.. 2.5 శాతం మంది మాత్రమే రెండో డోసు వేయించుకున్నారు. ప్రస్తుతం రోజువారీ వ్యాక్సినేషన్ 78వేలుగా ఉండగా.. 8.4రెట్లు పెంచి అంటే రోజుకు 6.6లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలి. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 38.1శాతం ప్రజలకు వ్యాక్సిన్లు ఇచ్చింది. అయితే, 7.9శాతం మందే రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 18వేల మందికి వ్యాక్సినేషన్ చేపడుతుండగా.. ఆ సంఖ్యను 41వేలకు పెంచాల్సిన అవసరముంది. మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ను 4.5రెట్లు పెంచాలి.
కేరళలో అయితే వ్యాక్సినేషన్ 31శాతం పూర్తి కాగా.. రెండు డోసులు వేయించుకున్నది కేవలం 8.1శాతం మాత్రమే. అయితే, డిసెంబర్ నాటికి ప్రజలందరికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే రాష్ట్రంలో వ్యాక్సినేషన్ను 2.8రెట్లు పెంచితే సరిపోతుంది. మొత్తంగా అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ను 5.. అంతకంటే ఎక్కువ రెట్లు పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్