కొత్త రకాన్ని ఎదుర్కొనేలా టీకాను మార్చొచ్చా?
వ్యాక్సిన్ రాకతో కాస్త కుదుటపడుతున్న ప్రపంచాన్ని కొత్త రకం కరోనా మళ్లీ కలవరంలోకి నెట్టింది. దీంతో ఇప్పటికే అభివృద్ధి చేసిన టీకాలు పనిచేస్తాయా? లేదా? అన్న అనుమానాలు అందరిలో రేకెత్తుతున్నాయి. వైద్య నిపుణుల మాత్రం కొత్త రకాన్ని ఎదుర్కొనేలా టీకాను మార్చడం పెద్ద పనేమీ కాదంటున్నారు..........
ఇంటర్నెట్ డెస్క్: వ్యాక్సిన్ రాకతో కాస్త కుదుటపడుతున్న ప్రపంచాన్ని కొత్త రకం కరోనా మళ్లీ కలవరంలోకి నెట్టింది. దీంతో ఇప్పటికే అభివృద్ధి చేసిన టీకాలు పనిచేస్తాయా? లేదా? అన్న అనుమానాలు అందరిలో రేకెత్తుతున్నాయి. వైద్య నిపుణులు మాత్రం కొత్త రకాన్ని ఎదుర్కొనేలా టీకాను మార్చడం పెద్ద పనేమీ కాదంటున్నారు. నిమిషాల్లో కొత్త టీకాను సృష్టించొచ్చని తెలిపారు. వైరస్ రూపాంతరం చెందుతున్న కొద్దీ వ్యాక్సిన్ను సైతం అందుకు అనుగుణంగా మార్చొచ్చని వెల్లడించారు.
నిమిషాలు చాలు...
ఇలా వ్యాక్సిన్ను పునర్నిర్మించడం నిమిషాల్లో జరిగే ప్రక్రియ అని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన మెడిసిన్ ప్రొఫెసర్ డ్రూ వెస్మన్ తెలిపారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన రెండు ప్రఖ్యాత వ్యాక్సిన్లలో ఒకదాన్ని రూపొందించిన బృందంలో వెస్మన్ పనిచేశారు. వైరస్ తరచూ రూపాంతంరం చెందుతోందని.. తద్వారా ఇతరులకు సోకే గుణం హెచ్చిస్తోందని ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. వెస్మన్ వంటి వారి వైద్య నిపుణుల ప్రకటన ఊరట కలిగిస్తోంది.
అనుమతి లభించడమే ఆలస్యం...
అయితే, టీకాను కొత్త రకాల్ని ఎదుర్కొనేలా మార్చినప్పటికీ.. అనుమతి ప్రక్రియకు మాత్రం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం రావొచ్చని వెస్మన్ తెలిపారు. ఫైజర్, మోడెర్నా సహా ఇతర వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ అనుమతికి అవలంబించిన ప్రక్రియే దీనికీ అనుసరించే అవకాశం ఉందని అంచనా వేశారు. భద్రత, రోగనిరోధకతను నిరూపించడం కోసం మరోసారి ప్రయోగాలు జరపాల్సి రావొచ్చని తెలిపారు. దీంతో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
ఇందుకే అన్ని రూపాలనూ ఎదుర్కోగలదు..
వైరస్ రూపాంతరం చెందడాన్ని బట్టి చూస్తే అది మానవ శరీరంలోకి చొచ్చుకెళ్లేందుకు అనుగుణంగా మారుతున్నట్లు తెలుస్తోందని వెస్మన్ తెలిపారు. అందుకోసం మహమ్మారి కొత్త మార్గాల్ని అన్వేషించుకుంటోందన్నారు. అయితే, ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు రూపాంతరం చెందిన వైరస్ను దీటుగా ఎదుర్కోగలవని ఉద్ఘాటించారు. ఈ పద్ధతిలో మన శరీరంలో సహజంగా ఉండే ఎంఆర్ఎన్ఏలను పోలిన కృత్రిమ మెసెంజర్ ఆర్ఎన్ఏలను శరీరంలోకి పంపిస్తారు. వైరస్ శరీరంపై దాడి చేయగానే ఈ ఆర్ఎన్ఏలు యాంటీబాడీల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. ఈ యాంటీబాడీలు వైరస్లో ఉండే కొమ్ము భాగాలపై దాడి చేసి మన కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. కొత్త రకాల్లో ముఖ్యంగా కొమ్ము భాగాల్లోనే మార్పులు సంభవిస్తున్నట్లు గుర్తించారు. అయితే, యాంటీబాడీలు పూర్తి కొమ్ము భాగాన్ని చుట్టుముడతాయని తెలిపారు. ఎంత రూపాంతరం చెందినా.. కొమ్ము భాగంలో యాంటీబాడీలు దాడి చేయడానికి అనువుగా ఉండే ప్రాంతాలు ఇంకా అనేకం ఉంటాయని వివరించారు. ఈ నేపథ్యంలో ఎంఆర్ఎన్ఏ సాంకేతికతతో అభివృద్ధి చేసిన టీకాలు కొత్త రకాలపైనా సమర్థంగా పనిచేసేలా మార్చడం సులభమని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇంకా లోతైన అధ్యయనం...
ఏదేమైనా కరోనా వైరస్పై ఇంకా లోతైన అధ్యయనం జరగాల్సిన అసవరం ఉందని మరికొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా జన్యుక్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా అనేక పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉంటూ వైరస్ కట్టడి నిబంధలను పాటించాలని సూచించారు. భవిష్యత్తుల్లో మరింత ప్రమాదకరమైన కొత్త రూపాలు వెలుగులోకి వచ్చే అవకాశాల్ని కొట్టిపారేయలేమన్నారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!