BF7: బీఎఫ్7 వేరియంట్.. భారత్కు ఎందుకంత అప్రమత్తత?
డెల్టా, ఒమిక్రాన్ లాంటి వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ బీఎఫ్7 వ్యాప్తిపై ఆందోళన చెందుతోంది. ఒక్క చైనాలో తప్ప దీని వ్యాప్తి ఇతర దేశాల్లోనూ అంత ఉద్ధృతంగా లేనప్పటికీ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎందుకో తెలుసా?
ఇంటర్నెట్డెస్క్: చైనా (China)లో తీవ్ర రూపం దాల్చుతున్న బీఎఫ్.7 (BF.7) వేరియంట్ భారత్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ కేవలం నాలుగు కేసులే నమోదైనప్పటికీ భారత ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ఇంతకుముందు డెల్టా (Delta), ఒమిక్రాన్ (Omicron) లాంటి వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ ఈ వేరియంట్ పట్ల అధికారులు ఎందుకంత ఆందోళన గురవుతున్నారు? అసలు ఈ వేరియంట్ లక్షణాలేంటి?
- బీఎఫ్ 7 ప్రధానంగా ఎగువ శ్వాసకోశ సమస్యలను సృష్టిస్తుంది. అంటే ఛాతీ పైభాగం, గొంతుపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు జ్వరం, జలుబు లాంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమై వ్యక్తి చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ.
- కొందరు వ్యక్తుల్లో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స చేసుకోవడం మంచిది. దీనివల్ల ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది.
- భారత్లో కొన్ని రోజులుగా సాధారణ కరోనా కేసులు 200కు దిగువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. జులై- అక్టోబరు నెలల మధ్యలో 4 బీఎఫ్7 కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో మూడు గుజరాత్లో నమోదుకాగా.. ఒక కేసు ఒడిశాలో గుర్తించారు. అయితే ఈ నలుగురూ వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.
- గత వేరియంట్లతో పోల్చుకుంటే బీఎఫ్7 తీవ్రత అంత ఎక్కువేమీ కాదు. కానీ, వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్నందున అత్యధిక మందికి ఈ వైరస్ సోకే అవకాశముందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్లో ఇది ప్రవేశిస్తే.. ఇప్పటివరకు ఎదుర్కొన్న వేరియంట్ల కంటే దీని బారిన పడినవారు అధిక సంఖ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా బాధితులకు వైద్య సదుపాయాలు కష్టతరమవుతాయని చెబుతున్నారు.
- 2019లో కరోనా ప్రారంభంలో చైనా ఎదుర్కొన్న పరిస్థితులు ఒక ఎత్తయితే.. బీఎఫ్ 7తో ప్రస్తుతం అంతకుమించిన కష్టాలను ఆ దేశం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ వేరియంట్ భారత్లో వ్యాప్తి చెందితే పరిణామాలు ఎలా ఉంటాయోనని ప్రభుత్వం, వైద్యాధికారులు అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు.
- బీఎఫ్7 వేరియంట్ కేవలం చైనాలో మాత్రమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. అయితే చైనాలో ఉన్నంత ఉద్ధృతంగా ఇతర దేశాల్లో వ్యాప్తి చెందకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం.
- రెండు నెలల క్రితమే ఈ వేరియంట్ తమ దేశంలోకి వచ్చిందని గుర్తించిన ఇంగ్లాండ్.. పటిష్ఠ చర్యలతో దాని వ్యాప్తిని అడ్డుకోగలిగింది.
- చైనాలో బీఎఫ్ 7 వేరియంట్ వ్యాప్తి చెందడానికి అక్కడి ప్రజల వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటం కూడా ఓ కారణం కావొచ్చు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు కాకపోవడం కూడా ఈ వేరియంట్ వ్యాప్తికి దోహదం చేసి ఉండొచ్చని వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- ప్రపంచ దేశాల్లో బీఎఫ్7 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీతోపాటు పలువురు వైద్య అధికారులు తాజాగా దీనిపై తాజాగా సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. మాస్క్ ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. రాబోయే పండగ సీజన్ను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు.
- బీఎఫ్7 వ్యాప్తి నేపథ్యంలో భారత్-చైనా మధ్య విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల్లో ర్యాండమ్గా 2 శాతం మంది నమూనాలను సేకరించి పరీక్ష చేయాలని నిర్ణయించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
న్యూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
న్యూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?