Indain Navy: తదుపరి నౌకాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ హరికుమార్
భారత నౌకదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆయన నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ ...
న్యూదిల్లీ: భారత నౌకదళ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ నియామకం కానున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆయన నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నౌకాదళ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30న ప్రస్తుత భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కరమ్బీర్ సింగ్ పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అదే రోజున వైస్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.
1962 ఏప్రిల్ 12న జన్మించిన వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ 1983లో భారత నౌకదళంలో చేరారు. 39 ఏళ్లలో ఆయన కమాండ్, స్టాఫ్ విభాగాల్లో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఐఎన్ఎస్ నిషాంక్, మిస్సైల్ కార్వెట్, ఐఎన్ఎస్ కొరా, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణ్విర్కు కమాండింగ్ అధికారిగా పనిచేశారు. నేవీ ఎయిర్క్రాఫ్ట్ ఐఎన్ఎస్ విరాట్కు నాయకత్వం వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.