Hanoi: ఆ నగరం మొత్తానికి కొవిడ్ పరీక్షలు
వియత్నాం ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద పట్టణమైన హనోయ్లో ప్రజలందరికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్డెస్క్: వియత్నాం ప్రభుత్వం దేశంలోనే అతిపెద్ద పట్టణమైన హనోయ్లో ప్రజలందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దేశంలో సరికొత్త వేరియంట్ వెలుగు చూడటంతో వియత్నాం అప్రమత్తమైంది. కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇక హుచిమిన్ నగరంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రకటించింది. 10 మందికి మించి గుమిగూడటాన్ని రెండు వారాలపాటు నిషేధించింది. వియత్నాంలో గత గురువారం నుంచి చాలా వరకూ వ్యాపారాలను మూసివేశారు. స్థానిక చర్చిలో వైరస్ వ్యాపించేలా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఒక జంటపై కేసు నమోదు చేశారు. దాదాపు 145 కేసులకు చర్చితో సంబంధాలు ఉండటంతో లాక్డౌన్ చేశారు. వియత్నాంలో మత సంబంధమైన అన్ని రకాల కార్యక్రమాలపై నిషేధం ఉంది.
హనోయ్ నగర పాలక అధికారులు రోజు లక్ష నమూనాలు చొప్పున ప్రజలందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ‘వియత్నమ్ న్యూస్’ సంస్థ పేర్కొంది. వియత్నాంలో ఏప్రిల్ నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక్కడ మొత్తం 31 మున్సిపాలిటీలు, ప్రావిన్స్లో కలిపి 4,000 పైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తి మొదటి దశలో నమోదైన కేసులతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు ఉంది.
భారత్, బ్రిటన్లలో కనిపించిన కరోనా వైరస్ సంకర రకం వియత్నాంను హడలెత్తిస్తోంది. సగానికి పైగా భూభాగంలో సంకర రకం వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇది గాలిలో క్షణాల్లో వ్యాపిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి న్యుయెన్ థాన్ లాంగ్ శనివారం చెప్పారు. వియత్నాంలో తొలి విడతలోనే ఏడు రకాలైన కరోనా వైరస్ వ్యాప్తి చెందినా ఉద్ధృతికి చాలావరకూ కళ్లెం వేసి ప్రశంసలు పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిర్దిష్టంగా వీటి సంఖ్య ఎంత అనేది ప్రభుత్వం వెల్లడించలేదు. భారత్, బ్రిటన్లలో కనిపిస్తున్న రకాల హైబ్రిడ్ వేరియంట్ ప్రస్తుతం ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్కు కళ్లెం వేయడంలో భాగంగా లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించారు.
కరోనా వైరస్ శరీరంలో పునరుత్పత్తి అవుతున్న సమయంలో జరిగే స్వల్ప జన్యుమార్పుల కారణంగా కొత్త రకాలు పుట్టుకొస్తాయి. ఇవన్నీ 2019లో చైనాలో కనిపించిన వైరస్ను పోలి ఉన్నా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని నాలుగు ఆందోళనకర వేరియంట్లుగా గుర్తించింది. వియత్నాం ఇప్పటి వరకు 10లక్షల మందికి ఆస్ట్రాజెనికా టీకాలను వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఫైజర్ నుంచి మరో 30 లక్షల టీకాలు రానున్నాయి. మిగిలిన వారికి టీకాల కోసం మోడెర్నాతో ఇప్పటికే చర్చలు జరుపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.