Vaccination: అపోహలు వద్దు.. టీకానే ముద్దు
కరోనా వైరస్కు కళ్లెం వేయటమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నాయి. కరోనా కోరల నుంచి తప్పించుకునేందుకు టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇప్పటికీ చాలా మందిలో టీకాపై అపోహలు బలంగా
పల్లెబాటపట్టిన యూపీ ఆరోగ్య సిబ్బంది
లఖ్నవూ: కరోనా వైరస్కు కళ్లెం వేయటమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీ కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నాయి. కరోనా కోరల నుంచి తప్పించుకునేందుకు టీకానే ప్రధాన ఆయుధమని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు చెబుతున్నా.. ఇప్పటికీ చాలా మందిలో టీకాపై అపోహలు బలంగా నాటుకుపోయాయి. ప్రారంభంలో దేశ వ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపించినా.. పట్టణ ప్రాంత వాసులు టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ మారుమూల ప్రాంతాల్లో మాత్రం ఆ పరిస్థితి ఇంకా కనిపించటం లేదు. ఈ నేపథ్యంలోని ఉత్తరప్రదేశ్ ఆరోగ్య సిబ్బంది పల్లెబాట పట్టింది. పల్లెవాసుల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించి టీకా వైపు మెుగ్గుచూపేలా వారిలో అవగాహన కల్పిస్తోంది.
ఉత్తరప్రదేశ్లోని మారుమూల గ్రామాల్లో కరోనా సహా కొవిడ్ టీకాలపై అపోహలు రాజ్యమేలుతున్నాయి. ప్రధానంగా జామ్సోటి, సికిందర్పుర్ గ్రామ ప్రజలు కరోనాపై కనీస అవగాహన లేకుండా జీవిస్తున్నారు. కరోనా కేవలం పట్టణాల్లో మాత్రమే ఉందని, తమ గ్రామం వైరస్ నుంచి పూర్తిగా సురక్షితమని అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు టీకాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలు వారిని వ్యాక్సినేషన్కు దూరం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్థులకు వైరస్ పట్ల అవగాహన కల్పించడంతోపాటు టీకాలు వేసుకునేలా అక్కడి ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి కొవిడ్పై అవగాహన కల్పిస్తున్నారు. టీకా వేసుకోవాల్సిన అత్యవసర పరిస్థితుల్ని పల్లెవాసులకు వివరిస్తున్నారు.
కరోనా రెండో దశ ఉద్ధృతితో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్, మే నెలల్లోనే సుమారు లక్షా 80 వేల మంది కొవిడ్కు బలైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. థర్డ్ వేవ్ సైతం దేశంపై విరుచుకుపడే అవకాశం ఉందని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని మెజారిటీ ప్రజలు ఇంకా టీకాలకు దూరంగా ఉండటం ఆందోళనను మరింత పెంచుతోంది. వ్యాక్సిన్లపై సామాజిక మాధ్యమాలు సహా ఇతర వేదికలపై జరుగుతున్న అసత్య ప్రచారాలు టీకా కార్యక్రమాన్ని బలహీనం చేస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే రుతుక్రమం దెబ్బతింటుందని, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందన్న భయాలు చాలా మంది మహిళల్లో ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూపీ ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, రేడియో ప్రచారాలు ప్రజల్లో నెలకొన్ని ఆందోళన, అపోహలు తగ్గిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
టీకాలకు ప్రజల్ని దూరం చేస్తున్న అసత్య ప్రచారాలపై కేంద్రం సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్పై వదంతుల వల్ల సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకి తీవ్ర హాని కలుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. టీకాపై దుష్ప్రచారాలను తరిమికొడుతూ ప్రతిఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ మెగా డ్రైవ్ ప్రారంభమైన సందర్భంగా వ్యాక్సిన్లపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే చెడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అర్హులైన ప్రతిఒక్కరు టీకాలు వేసుకోవడం ద్వారా కొవిడ్ ముప్పును అడ్డుకోవచ్చని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్