Puducherry: నడుములోతు నీళ్లలోనే శవయాత్ర!
చనిపోయిన ఓ వృద్ధుని అంత్యక్రియలు నిర్వహించేందుకు పుదుచ్చేరిలోని కురువినాథం గ్రామస్థులు పెద్ద సాహసమే చేశారు. నదిలో నడుములోతు నీళ్లల్లో శవాన్ని మోస్తూ తెన్పెన్నై నది
పుదుచ్చేరి: చనిపోయిన ఓ వృద్ధుని అంత్యక్రియలు నిర్వహించేందుకు పుదుచ్చేరిలోని కురువినాథం గ్రామస్థులు పెద్ద సాహసమే చేశారు. నదిలో నడుములోతు నీళ్లల్లో శవాన్ని మోస్తూ తెన్పెన్నై నది ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు దాటారు. నది పొంగి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో కురువినాథం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి వెళ్లాలంటే నది దాటాల్సి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో పాడె మోసేవారంతా నడుములోతు నీటిలోనే నడుచుకుంటూ అవతలి వైపు వెళ్లారు. తెన్పెన్నై నదిపై వంతెన నిర్మించకపోవడంతో.. ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రతిసారీ ఇదే పరిస్థితి తలెత్తుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని విన్నవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా