Puducherry: నడుములోతు నీళ్లలోనే శవయాత్ర!

చనిపోయిన ఓ వృద్ధుని అంత్యక్రియలు నిర్వహించేందుకు పుదుచ్చేరిలోని కురువినాథం గ్రామస్థులు పెద్ద సాహసమే చేశారు. నదిలో నడుములోతు నీళ్లల్లో శవాన్ని మోస్తూ తెన్‌పెన్నై నది

Published : 18 Nov 2021 01:47 IST

పుదుచ్చేరి: చనిపోయిన ఓ వృద్ధుని అంత్యక్రియలు నిర్వహించేందుకు పుదుచ్చేరిలోని కురువినాథం గ్రామస్థులు పెద్ద సాహసమే చేశారు. నదిలో నడుములోతు నీళ్లల్లో శవాన్ని మోస్తూ తెన్‌పెన్నై నది ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు దాటారు. నది పొంగి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో కురువినాథం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానానికి వెళ్లాలంటే నది దాటాల్సి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో పాడె మోసేవారంతా నడుములోతు నీటిలోనే నడుచుకుంటూ అవతలి వైపు వెళ్లారు. తెన్‌పెన్నై నదిపై వంతెన నిర్మించకపోవడంతో.. ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రతిసారీ ఇదే పరిస్థితి తలెత్తుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.  అధికారులు వంతెన నిర్మించి తమ కష్టాలు తీర్చాలని విన్నవించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని