Agnipath Protests: 7 రాష్ట్రాల్లో అగ్నిపథ్ ఆందోళనలు.. బిహార్లో ఒకరు మృతి..!
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త
ఇంటర్నెట్డెస్క్: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జ్వాలలు రేగాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మొత్తం 7 రాష్ట్రాలకు ఈ నిరసనలు పాకగా.. దాదాపు 200 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బిహార్లో నేతల ఇళ్లపై దాడి..
అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ బిహార్లోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రహదారులు, రైల్వే ట్రాక్లపైకి చేరి నిరసన చేపట్టారు. బెగుసరై జిల్లా రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలుకు నిప్పుపెట్టారు. మరోవైపు, బెట్టాయ్లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణు దేవి, రాష్ట్ర భాజపా చీఫ్ సంజయ్ జైశ్వాల్ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘటనల్లో ఓ పోలీసు గాయపడ్డారు. లఖిసరై జిల్లాలోని రైల్వేస్టేషన్లో ఓ రైలుకు నిరసనకారులు నిప్పంటించారు. దీంతో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఈ కారణంగా ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికాగా.. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
యూపీలో ఉద్రిక్తత..
ఉత్తరప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో రైల్వే స్టేషన్ల వద్ద నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పలు రైళ్లకు నిప్పటించారు. అయితే ఆ సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అలీగఢ్లో యమునా ఎక్స్ప్రెస్వే వద్దకు పెద్దఎత్తున ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు పోలీసు వాహనంపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ ప్రాంతంలో ఆందోళనకారులు హైవేపై బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో లాఠీఛార్జ్ చేశారు.
గురుగ్రామ్లో 144 సెక్షన్..
హరియాణాలో అగ్నిపథ్పై ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు రహదారులను నిర్బంధించడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో నగర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
దిల్లీలో మెట్రోల వద్ద భద్రత
దిల్లీలో ఛాత్ర -యువ సంఘర్ష్ సమితి నేతృత్వంలోని విద్యార్థులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనల దృష్ట్యా పలు మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి జిల్లాలో విద్యార్థులు రోడ్లపై టైర్లకు నిప్పంటించి ధర్నా చేపట్టారు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా పలువురు గాయపడ్డారు.
200 రైళ్లకు అంతరాయం..
పలు రైల్వే స్టేషన్లలో ఆందోళనల నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 200లకు పైగా రైళ్లపై నిరసనల ప్రభావం పడింది. దక్షిణ మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేశాయి. మరికొన్నింటిని దారి మళ్లించాయి. తూర్పు మధ్య రైల్వే 59 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
పశ్చిమ్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు గుప్పించారు. -
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ (Modi) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. వాటిపై అందిన ఫిర్యాదు ఈసీ పరిశీలనలో ఉందని సమాచారం. -
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. -
నూడుల్స్లో రూ.6 కోట్ల బంగారం, వజ్రాలు!
నూడుల్స్లో వజ్రాలు, బంగారం దాచి అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు ప్రయాణికులను ముంబయి కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. -
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా