అమెరికాలో కాల్పులు.. విశాఖ జిల్లా వాసి మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అలాబామా రాష్ట్రంలో ఓ దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన

Published : 12 Feb 2022 15:46 IST

హైదరాబాద్‌‌: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. అలాబామా రాష్ట్రంలో ఓ దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన యువకుడు చిట్టూరి సత్యకృష్ణ(27) ప్రాణాలు కోల్పోయాడు. పాత బర్మింగ్‌ హోంలోని ఓ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తోన్న సత్యకృష్ణ నెల రోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సత్యకృష్ణ మృతి వార్త తెలియగానే ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. యువకుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. భాజపా రాష్ట్ర నాయకులు విష్ణు వర్ధన్‌ రెడ్డి కూడా ఈ ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. సత్యకృష్ణ మృతి విచారకరమన్న ఆయన.. అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగు సాయం అందించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని