అంతరిక్షం నుంచి ఓటు.. ఎలా వేశారంటే!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ. ఈ ఎన్నికల్లో పలువురు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయగా.. మరికొంతమంది మెయిల్ ఇన్ బ్యాలెట్ పద్ధతిని ఎంచుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అంతరిక్షం నుంచి కూడా ఓటు వేయొచ్చనే
(ఫొటో : నాసా వెబ్సైట్ నుంచి)
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఈ ఎన్నికల్లో పలువురు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయగా.. మరికొంతమంది మెయిల్ ఇన్ బ్యాలెట్ పద్ధతిని ఎంచుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అంతరిక్షం నుంచి కూడా ఓటు వేయొచ్చనే విషయం మీకు తెలుసా?. అవును.. పెరిగిన సాంకేతికత నేపథ్యంలో అంతరిక్షం నుంచి కూడా ఓటు వేసేందుకు ఇక్కడి చట్టాలు అనుమతిస్తున్నాయి.
నాసా వ్యోమగామి కేట్ రూబిన్స్ తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) పోలింగ్ బూత్ నుంచి ఉపయోగించుకున్నారు. భార రహిత స్థితిలో ఆమె ఓటు వేయడం ఇది రెండోసారి కావడం విశేషం. 2016లో ఆమె ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అంతరిక్ష కేంద్రం నుంచి అమెరికన్ వ్యోమగాములు ఓటు వేసేందుకు వీలుగా 1990లో టెక్సాస్ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. 1997 నుంచి అమెరికా వ్యోమగాములు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నాసా వ్యోమగామి డేవిడ్ ఓల్ఫ్ 1997లో మిర్ స్పేస్ స్టేషన్ నుంచి ఓటు వేసి.. అంతరిక్షం నుంచి ఓటు వేసిన తొలి అమెరికన్గా రికార్డు సృష్టించారు. అయితే ఓటు వేసేందుకు ముందుగానే వారు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో నాసా తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
* మిలటరీ సభ్యులు ఉపయోగించుకునే ఫెడరల్ ఫోస్ట్ కార్డు అప్లికేషన్(ఎఫ్పీఎస్ఏ) ప్రక్రియ ద్వారానే ఇది కూడా ప్రారంభమవుతుంది.
* ఐఎస్ఎస్కు వెళ్లే ముందు లాంచ్ సమయంలోనే ఈ దరఖాస్తును పూర్తి చేసి ఓటు వేసేందుకు తమ సంసిద్ధతను తెలపాల్సి ఉంటుంది.
* వ్యోమగామి హోమ్ కౌంటీ నుంచి కౌంటీ క్లర్క్ టెస్టు బ్యాలెట్ను హ్యూస్టన్లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్కి పంపిస్తారు.
* స్పేస్ స్టేషన్ కంప్యూటర్ను ఉపయోగించి వారు టెస్టు బ్యాలెట్ను పూర్తి చేసి తిరిగి కౌంటీ క్లర్క్కి పంపించగలరా అని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు.
* ఇది విజయవంతమైతే సురక్షితమైన ఎలక్ట్రానిక్ బ్యాలెట్ను జాన్సన్ మిషన్ కంట్రోల్ సెంటర్నుంచి అప్లింక్ చేస్తారు.
* నిర్ధిష్ట ఆధారాలతో కూడిన ఈ-మెయిల్ కౌంటీ క్లర్క్ నుంచి వ్యోమగామికి చేరుతుంది. ఇందులోని వివరాలు ఆ బ్యాలెట్ను తెరిచేందుకు ఉపయోగపడతాయి.
* అనంతరం వ్యోమగామి తన ఓటు హక్కును సురక్షితమైన పద్ధతిలో వినియోగించుకుని ఆ బ్యాలెట్ను కౌంటీ క్లర్క్ కార్యాలయానికి డౌన్లింక్ చేస్తారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!