Assembly elections 2022: ఒంటిగంటకు పోలింగ్ ఇలా.. కాషాయ కండువాతో సీఎం ఓటు..!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్లోని 55 స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా.. ఉత్తరాఖండ్లోని
లఖ్నవూ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్లోని 55 స్థానాలకు ఓటింగ్ జరుగుతుండగా.. ఉత్తరాఖండ్లోని మొత్తం 70, గోవాలోని మొత్తం 40 నియోజకవర్గాలకు ఒకే విడత పోలింగ్ నేడు కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి యూపీలో 39.07శాతం, ఉత్తరాఖండ్లో 35.21శాతం, గోవాలో 44.63శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవడంలో భద్రతా సిబ్బంది సాయం చేస్తున్నారు. వారిని దగ్గరుండి పోలింగ్ కేంద్రాలకు చేరుస్తున్నారు.
కోడ్ ఉల్లంఘించిన ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి, ఆయన సతీమణి గీత ఖతిమాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఆ సమయంలో వీరు కాషాయ కండువాలను ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఆ కండువాలపై భాజపా గుర్తు కమలం పువ్వు కూడా ఉంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి సీఎం దంపతులు భాజపా కండువాలు ధరించి ఓటు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేగాక, ఓటు వేసిన అనంతరం సీఎం సతీమణి పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తూ కనిపించారు.
భాజపా అభ్యర్థి కారుపై దాడి..
ఉత్తరప్రదేశ్లో రెండో విడత పోలింగ్ వేళ.. ఓ భాజపా అభ్యర్థి కారుపై దాడి జరగడం కలకలం రేపుతోంది. సాంబల్ జిల్లాలోని అస్మోలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న భాజపా నేత హరేంద్ర అలియాస్ రింకు వాహనంపై నిన్న రాత్రి కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలియా దేవీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిర్నీ గ్రామంలో హరేంద్ర ఓటర్లకు మద్యం పంచుతున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా.. హరేంద్ర కారులో మద్యం సీసాలు లభించలేదు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు హరేంద్ర వాహనంపై దాడి చేశారు. ఆయనపైనా దాడి చేసేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వెంటనే ఆయనను సమీపంలోని పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆందోళనకారుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు భాజపా ఆరోపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.