Afghanistan: వారు వస్తారు..నన్ను చంపేస్తారు..
అఫ్గాన్లో తొలి మహిళ మేయర్ ఆమె.. పిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు.. అవమానాలు.. హత్యాయత్నాలు. తన తండ్రినీ చంపేశారు. అయినా వెరవలేదు. విద్యావంతురాలైన ఆమె.. తన ప్రాంతం అభివృద్ధి దిశగా కలలు కన్నారు..
హక్కుల కార్యకర్త.. తొలి మహిళ మేయర్గా సంస్కరణలు
తాలిబాన్ల రాకతో నిస్సహాయురాలిగా మిగిలిన వైనం!
కాబూల్: అఫ్గాన్లో తొలి మహిళ మేయర్ ఆమె.. పిన్న వయస్సులోనే బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు.. అవమానాలు.. హత్యాయత్నాలు. తన తండ్రినీ చంపేశారు. అయినా వెరవలేదు. విద్యావంతురాలైన ఆమె.. తన ప్రాంతం అభివృద్ధి దిశగా కలలు కన్నారు. ఈ దిశగా పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు. కానీ.. నేడు పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి! కారణం తాలిబన్లు. రెండు దశాబ్దాల క్రితం ఆంక్షల సంకెళ్లలో బందీగా కొట్టుమిట్టాడిన తన దేశం.. తాజాగా మరోసారి వారి చేతికి వెళ్లిపోవడంతో ఆమె నిస్సహాయంగా మిగిలారు. మళ్లీ తన బాల్యం నాటి.. ఆటవిక తరహా పాలన ఎక్కడ వస్తుందోనని కలవరానికి గురవుతున్నారు. ఆమే.. 29 ఏళ్ల జరిఫా గఫారీ. అఫ్గాన్లో మహిళల హక్కుల సాధికారతకు చేసిన కృషికిగానూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. స్థానిక మహిళలకు ఆమె ఒక రోల్మోడల్. 2019లో బీబీసీ రూపొందించిన ‘ప్రపంచవ్యాప్తంగా వంద మంది స్ఫూర్తిదాయక, ప్రభావవంత మహిళలు’ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. 2020లో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆమెను ఇంటర్నేషనల్ వుమెన్ ఆఫ్ కరేజ్ ( ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహిళ)గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె తన మాతృభూమిలో సంక్షోభ పరిస్థితులను గమనిస్తూ.. తల్లడిల్లుతున్నారు.
భారత్లోనే ఉన్నత విద్య..
అఫ్గాన్లోని పక్తియా ప్రావిన్స్లో 1992లో జన్మించిన గఫారీ.. స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించారు. మన దేశం చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు పూర్తిచేశారు. న్యాయవాది అయిన ఆమె.. హక్కుల కార్యకర్త, రాజకీయవేత్త, వ్యాపారవేత్తగానూ రాణించారు. ఆమె ప్రతిభను చూసి 2018 జులైలో వార్దాక్ ప్రావీన్స్లోని మైదాన్ శెహర్కు మేయర్గా ఎంపిక చేశారు. కానీ.. స్థానిక రాజకీయ శక్తుల కారణంగా వెంటనే విధులు చేపట్టలేని దుస్థితి. ఎట్టకేలకు మార్చి 2019లో బాధ్యతలు స్వీకరించారు. మొదటిరోజే ఆమె వేధింపులు ఎదుర్కొన్నారు. పదవికి రాజీనామా చేయాలని బెదిరింపులు మొదలయ్యాయి. చంపేస్తామంటూ.. తాలిబన్, ఐఎస్ఐఎల్ తదితర ఉగ్రవాద సంస్థలు హెచ్చరించాయి. అనేక సందర్భాల్లో ఆమెపై హత్యాయత్నాలు జరిగాయి. 2020 నవంబరులో ఆమె తండ్రిని ముష్కరులు చంపివేశారు. ‘ఇది తాలిబన్ల దుశ్చర్య. మైదాన్ శెహర్లో వారు నన్ను ఉండదల్చుకోనివ్వలేదు. అందుకే వారు నా తండ్రిని చంపార’ని ఆమె గతంలో ఓ సందర్భంలో కన్నీటిపర్యంతమయ్యారు. కానీ.. వీడని సంకల్పంతో.. వీటన్నింటిని తట్టుకుని పాలన కొనసాగించారు. తాజాగా తన దేశం మరోసారి తాలిబన్ల వశం కావడంతో.. తన ఆవేదనంతా ఓ మీడియా ఇంటర్వ్యూలో వెళ్లగక్కారు. ‘వారు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటా. నాతో ప్రస్తుతం భర్త, కుటుంబ సభ్యులు మిగిలారు. మాకు సహాయం చేసేందుకు ఎవరూ లేరు. ఇప్పడు నాలాంటి వారికోసం వారు వస్తారు. చంపేస్తారు’ అని తాలిబన్లను ఉద్దేశించి గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. ఇది ఆమె ఒక్కరి పరిస్థితే కాదు.. వేలాది స్థానికులదీ అదే దుస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు