పర్యాటకులు రావొచ్చు.. కానీ!
కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ హిమాచల్ప్రదేశ్లో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన శిమ్లాలో పర్యాటకులు కొవిడ్ నిబంధనల్ని గాలికొదిలేయడం ఇటీవల జాతీయ స్థాయిలో............
కొవిడ్ మార్గదర్శకాలను తప్పక పాటించాలన్న హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్
దిల్లీ: కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ హిమాచల్ప్రదేశ్లో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన శిమ్లాలో పర్యాటకులు కొవిడ్ నిబంధనల్ని గాలికొదిలేయడం ఇటీవల జాతీయ స్థాయిలో చర్చనీయంశమైంది. ఈ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ ప్రజలకు పలు హెచ్చరికలు సూచనలు చేశారు. ‘‘ఇక్కడికి వచ్చే పర్యాటకులతో సహా అంతా ప్రభుత్వం విధించిన కొవిడ్ నిబంధనలు పాటించాలి. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఇటీవలి కాలంలో శిమ్లా, ధర్మశాలలకు అత్యధికంగా సందర్శకులు తరలి రావడంతో పర్యాటక స్థలాలన్నీ కిక్కిరిసిపోయాయి. వర్షాలు భారీగా కురుస్తున్న చోట్ల ప్రజలు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా చూసేలా జిల్లాలోని పోలీసు శాఖ పటిష్ఠ చర్యలు తీసుకుంది. కొవిడ్ కారణంగా పర్యాటక రంగం, వ్యాపారాలు దెబ్బతిన్న విషయం వాస్తవమే.. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే థర్డ్వేవ్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ గతంలో నీతి ఆయోగ్ నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ సూచనలను పాటించాలి’’ అని కోరారు.
కొండచరియలు విరిగిపడతాయ్.. జాగ్రత్త!
రాబోయే మూడు నాలుగు రోజుల్లో హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు నగరాలు/పట్టణాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కార్లు వరద నీటిలో పడవల్లా కొట్టుకుపోగా.. హోటళ్లు, భవనాలు నీటిలో మునిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్గా మారిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM