Rana Kapoor: ‘పద్మభూషణ్ ఇప్పిస్తామని ₹2 కోట్ల పెయింటింగ్ కొనిపించారు’
అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద తనపై జరుగుతున్న కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు యెస్ బ్యాంక్ సహ-వ్యవస్థాపకుడు రాణా కపూర్ కీలక ఆరోపణలు చేశారు.....
ఈడీ విచారణలో యెస్ బ్యాంక్ సహ-వ్యవస్థాపకుడు రాణా కపూర్
ముంబయి: అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (PMLA) కింద తనపై జరుగుతున్న కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు యెస్ బ్యాంక్ సహ-వ్యవస్థాపకుడు రాణా కపూర్ (Rana Kapoor) కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) నుంచి రూ.రెండు కోట్లతో ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్ హుస్సేన్కు సంబంధించిన పెయింటింగ్ను కొనుగోలు చేయాలని తనను బలవంతం చేసినట్లు ఆయన ఆరోపించారు.
నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న మురళీ దేవరా ఈ మేరకు తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. బదులుగా తనకు పద్మభూషణ్ పురస్కారం లభిస్తుందనే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ వివరాలను ముంబయిలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఈడీ ప్రస్తావించింది.
చెక్కు ద్వారా తాను అందించిన రూ.2 కోట్లను న్యూయార్క్లో సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు మురళీ దేవరా తనయుడు మిలింద్ దేవరా తనకు తర్వాత ఓ సందర్భంలో రహస్యంగా తెలిపినట్లు రాణా కపూర్ చెప్పారు. అయితే తనకు ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదని అన్నారు. ‘‘సోనియా చికిత్సకు సహకరించడం ద్వారా ఆ కుటుంబానికి చాలా మంచి పని చేశానని ఆమె సన్నిహితుడు అహ్మద్పటేల్ నాతో ఓ సందర్భంలో అన్నారు. నాకు పద్మభూషణ్ అందడంలో ఇది తోడ్పడుతందని చెప్పారు. అయితే ఈ కొనుగోలు బలవంతంగా జరిగింది. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు’’ అని రాణా పేర్కొన్నట్లు ఛార్జిషీట్లో ఈడీ పేర్కొంది.
దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL) సంస్థకు ఆర్థిక సహాయం అందించేందుకు నేరపూరితంగా వ్యవహరించటంతో పాటు ప్రతిగా రూ.600 కోట్లు లబ్ధి పొందారనే ఆరోపణలతో ఈడీ, సీబీఐ సంస్థలు రాణా కపూర్, ఆయన కుటుంబం, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాధ్వాన్లపై వేర్వేరుగా కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రాణా కపూర్ జ్యుడీషియల్ కస్టడిలో ఉన్నారు. రాణా కపూర్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధ్వాన్లు అనుమానాస్పద లావాదేవీల ద్వారా రూ.5,050 కోట్ల నగదును అక్రమంగా బదిలీ చేశారని ఈడీ తాజాగా ప్రత్యేక కోర్టులో సమర్పించిన ఛార్జిషీటులో పేర్కొంది.
ఖండించిన కాంగ్రెస్..
ఈడీ ఛార్జిషీట్లో పేర్కొన్నట్లుగా రాణా కపూర్ చేసిన ఆరోపణల్ని కాంగ్రెస్ వర్గాలు ఖండించాయి. తెలివిగా దివంగతులైన వారిపై ఆరోపణలు చేశారని ఓ కీలక నేత వ్యాఖ్యానించారు. రూ.5,000 కోట్ల కుంభకోణంలో చిక్కుకున్న వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం అని అన్నారు. రాణా కపూర్ తన ఆరోపణల్లో పేర్కొన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు మురళీ దేవరా, అహ్మద్ పటేల్ మరణించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.