NITI Aayog: ఇక మార్కెట్లో వృథా నీటి ట్రేడింగ్.. విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్ కసరత్తులు!
వృథాగా వెళ్లే నీటిని మార్కెట్లో వినియోగ వస్తువుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంబంధిత విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్ కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమోడిటీ ఎక్స్ఛేంజ్ల్లో బంగారం,
ఈనాడు, దిల్లీ: వృథాగా వెళ్లే నీటిని మార్కెట్లో వినియోగ వస్తువుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంబంధిత విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్ కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమోడిటీ ఎక్స్ఛేంజ్ల్లో బంగారం, వెండి, ముడిచమురును విక్రయిస్తున్నట్లుగానే.. వృథా నీటి వ్యాపారం కూడా ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చే పనికి నీతి ఆయోగ్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ విధానం ఉండగా.. దాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అనుసరిస్తున్న కొలమానాలపై అధ్యయన ప్రక్రియను ప్రారంభించింది.
నీటి వనరులను కొనడం, అమ్మడం, లీజుకివ్వడం ఈ విధానంలోని ప్రధాన ఉద్దేశం. ఈ వ్యాపారాన్ని తాత్కాలిక, శాశ్వత విభాగాలుగా విభజించొచ్చు. శాశ్వత విభాగంలోనివారు తమకున్న హక్కులను పూర్తిగా విక్రయించి ఎక్స్క్లూజివ్గా నీటిని వాడుకునే హక్కును అవతలి పార్టీకి ఇస్తారు. తాత్కాలిక పద్ధతిలో వ్యాపారం చేసేవారు వార్షిక ప్రాతిపదికన నీటి హక్కులను కేటాయిస్తారు. నానాటికీ జల వనరుల కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో నీటి మార్కెట్ అభివృద్ధి చెందడానికి వీలుంది. డిమాండ్, సరఫరా మధ్య ఉన్న వ్యత్యాసంపై ఆ మార్కెట్ ధరలు ఆధారపడి ఉంటాయి. కరవు నెలకొన్న ప్రాంతాలు, సరఫరా తక్కువగా ఉన్నచోట్ల నీటి ధరలు అధికంగా ఉండే అవకాశాలుంటాయి. జల అవసరాలు తక్కువగా ఉన్న పరిశ్రమలు.. తమ అధీనంలోని జల వనరులను ఎక్కువ నీటి అవసరాలున్నవారికి విక్రయించుకోవడానికి ఈ విధానంతో మార్గం సుగమమవుతుంది. ఇందులోని మార్కెట్ పనితీరు ప్రకారం వనరులు తక్కువగా ఉన్నచోట అత్యంత విలువైన పని కోసం వాటిని ఉపయోగించుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. దీనివల్ల నీటి సంరక్షణను ప్రోత్సహించినట్లవుతుంది. తద్వారా మిగిలిన నీటిని.. కొరత ఎదుర్కొంటున్నవారికి విక్రయించి లబ్ధిపొందొచ్చు. ఆస్ట్రేలియాలో 1980 నుంచి వాటర్ ట్రేడింగ్ విధానం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..